తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థ అభివృద్దిపై దృష్టి సారిస్తున్నారు. సజ్జనార్ ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటున్నారు. ప్రజల ఇబ్బందులపై ఎప్పటికప్పుడు వివరాల సేకరిస్తున్నారు.. కొన్ని సార్లు ఆయనే స్వయంగా పలు బస్టాండ్లను పరిశీలిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతేకాదు సంస్థ అభివృద్ది కోసం పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ.. మహిళలకు గుడ్న్యూస్ చెప్పారు.
ఆడపడుచులు వారి సోదరులకి రాఖీ పండుగను పురస్కరించుకుని స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని పరిస్థితి ఏర్పడితే.. వారి ఇబ్బందులను దూరం చేయడానికి కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలలో రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. దీని గురించి పూర్తి సమాచారం కోసం 9154298858, 9154298829 నంబర్లలో సంప్రదించాలని టీఎస్ ఆర్టీసీ సూచించింది.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మహిళలలు కొన్ని ఊర్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే టీఎస్ ఆర్టీసీ కల్పిస్తున్న ఈ ఆఫర్ వారికి ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది. తెలంగాణ లో మహిళలకు ఆర్టీసీ ఎప్పుడూ తోడు ఉంటుందని.. వారికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్ లో తీసుకు వస్తామని ఆర్టీసీ తెలిపింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.