దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డబ్బును కొట్టేయడానికి ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు. మీ KYC వివరాలను అప్డేట్ చేస్తామని, మీకు ఉద్యోగం వచ్చిందని, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇక.. పొరపాటున తెలియని నెంబర్ నుంచి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసి.. ఎవరు బాబు కాల్ చేస్తుంది అంటే చాలు.. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్కేర్, టెలికాం ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు..ఇలా అన్ని రకాల పేర్లు చెప్పి ఉన్నది కాస్తా ఊడ్చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోకండి అని ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్న ఈ నేరాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. హైదరాబాద్ సిటీ పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీలోని విక్రమాదిత్య క్యారెక్టర్ ను ఎంచుకున్నారు. ప్రభాస్ చేతనే అవగాహన కల్పిస్తున్నట్లుగా ఒక పోస్టర్ క్రియేట్ చేసి.. “ఏవేవో స్కీమ్ లని, ఆఫర్లు, బంపరాఫర్లని మీ ఫోన్లకి అపరిచిత వ్యక్తులు పంపే లింక్ లను ఓపెన్ చేయకండి, మీ అమూల్యమైన డబ్బులను సైబర్ నేరగాళ్ల వశం కానివ్వకండి. డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుందాం, సైబర్ యోధుల లాగా మారుదాం”. అంటూ ట్వీట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏవేవో స్కీమ్ లని, ఆఫర్లు, బంపరాఫర్లని మీ ఫోన్లకి అపరిచిత వ్యక్తులు పంపే లింక్ లను ఓపెన్ చేయకండి, మీ అమూల్యమైన డబ్బులను సైబర్ నేరగాళ్ల వశం కానివ్వకండి.
డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు..
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుందాం, సైబర్ యోధుల లాగా మారుదాం.#UnknownLinks#cyberwarrior. pic.twitter.com/x69FCHISXD— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) April 1, 2022