తెలంగాణలో ఎస్ఐ, ఏఏస్ఐ పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్నికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. మొత్తం 587 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా.. 2.47 లక్షల మంది పరీక్ష రాశారు.
తెలంగాణలో ఎస్ఐ, ఏఏస్ఐ పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్నికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. మొత్తం 587 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా.. 2.47 లక్షల మంది పరీక్ష రాశారు. గత ఏడాది ఆగస్టు 7న రాత పరీక్షతో ఈ నియామయక ప్రక్రియ మొదలైంది. సరిగ్గా ఏడాది తర్వాత తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 443 మంది పురుషులు, 153 మంది మహిళలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. విద్యార్హతలు, రిజర్వేషన్, స్థానికత, వయసు సడలింపు, హారిజెంటల్ రిజర్వేషన్, ఇతర బెనిఫిసరీలను పరిగణలోకి తీసుకొని తుది జాబితాను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
ఈ తుది జాబితాలో మట్టిలో మాాణిక్యాలు మెరిశారు. ఓ తాపీ మేస్త్రీ కూతురు ఎస్ఐ ఉద్యోగానికి ఎన్నికైంది. నల్గొండ జిల్లా వేముల పల్లి మండలం సల్క్ నూర్ గ్రామానికి చెందిన అంకెపాక తేజశ్విని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన ఎస్ఐ ఫలితాల్లో విజయం సాధించింది. తమ కూతురు ఈ ఉద్యోగానికి ఎంపిక అవ్వడం పట్ల తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలిపోతున్నారు. ఓ తాపీ మేస్త్రీ కూతురు ఎస్ఐ జాబ్ సాధించడం గర్వంగా ఉందని గ్రామస్థులు.. ఆమెను అభిందనల్లో ముంచేస్తున్నారు. కష్టే ఫలి అని మరోసారి పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు నిరూపిస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని తెలిసి.. చదువుకుని, ఉన్నత శిఖరాలకు వెళుతున్న ఇటువంటి ఆడ పిల్లల పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.