తెలంగాణలో ఎస్ఐ, ఏఏస్ఐ పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్నికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. మొత్తం 587 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా.. 2.47 లక్షల మంది పరీక్ష రాశారు.