సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. గిఫ్ట్, ఆఫర్స్ పేరుతో ఆన్ లైన్ మోసాలకు దిగుతున్నారు. సైబర్ నేరాలపై సైబర్ క్రైం పోలీసులు జనాలకు అవగాహన కల్పించినప్పటికి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు.
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. గిఫ్ట్, ఆఫర్స్ పేరుతో ఆన్ లైన్ మోసాలకు దిగుతున్నారు. సైబర్ నేరాలపై సైబర్ క్రైం పోలీసులు జనాలకు అవగాహన కల్పించినప్పటికి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. సైబర్ నేరస్థులు పంపించే లింక్స్, కాల్స్, ఎస్ ఎంఎస్ లకు స్పందించి వేలు, లక్షల్లో పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు బాధితులు. రోజుకో కొత్త రకం మోసంతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త రకం మోసానికి తెరలేపారు. సిమ్ కార్డులను 5జీ నెట్ వర్క్ కి అప్ గ్రేడ్ చేస్తామంటూ లింక్స్ పంపించి వాటిని ఓపెన్ చేసిన యూజర్ల అకౌంట్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు.
టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు టెలికాం రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ప్రస్తుతం 4జీ సేవలు అందుబాటులో ఉండగానే, 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ కి చెందిన ప్రముఖ నెట్ వర్క్ సంస్థలు 5జీ ని అందిస్తున్నాయి. దీనికి తగినట్లుగా 5జీ ఫోన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ తరుణంలో నెట్ వర్క కంపెనీలు 4జీ కలిగిన యూజర్లు 5జీ కి మారేందుకు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీన్ని అదునుగా బావించిన సైబర్ నేరగాళ్లు సిమ్ కార్డ్ అప్ గ్రేడ్ పేరుతో కాల్స్, లింక్స్ పంపించి మోసం చేస్తున్నారు.
టెలికాం కంపెనీల పేర్లతో సైబర్ నేరగాళ్లు యూజర్లకు లింక్స్ పంపించి సిమ్ 5జీకి అప్ గ్రేడ్ చేస్తామంటూ నమ్మబలుకుతున్నారు. కాల్స్ చేసి సిమ్ కార్డ్పై ఉన్న 20 అంకెల యూనిక్ సీరియల్ నెంబర్ తెలుసుకుని, ఆ తర్వాత సంబంధిత సిమ్ కార్డ్ నెట్వర్క్ కంపెనీకి కాల్ చేస్తారు. సిమ్ యూనిక్ నంబర్ చెప్పి అదే నంబర్తో మరో సిమ్ కార్డ్ తీసుకుంటారు. ఆ తర్వాత మొబైల్ నంబర్కు వచ్చే బ్యాంక్ మెసేజ్లు, నెట్బ్యాంకింగ్ సహా పూర్తి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తమ ఆధీనంలోకి తీసుకుంటారు. దీంతో పాటు లింక్స్ పంపించి ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా సిమ్ అప్డేట్ అవుతుందని నమ్మిస్తారు. మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ చెప్పాలని అడుగుతారు. ఓటీపీ చెప్పిన తరువాత ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. 5జీ అప్గ్రేడ్తో జరుగుతున్న మోసాలతో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మోసం జరిగితే https://www.cybercrime.gov.in ఫిర్యాదు నమోదు చేయాలి. టోల్ ఫ్రీ నంబర్ 1930కి డయల్ చేయాలని కోరుతున్నారు.