దోచుకోవటటానికి కాదేదీ అనర్హం అన్నట్లు.. సైబర్ నేరగాళ్లు దేన్నీ వదలటం లేదు. ఇప్పుడు కొత్తగా పీఎఫ్ ఖాతాల మీద పడ్డారు. ఆధార్ల సహాయంతో పీఎఫ్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. ఆన్లైన్ మోసాలు కూడా ఎక్కువయిపోయాయి. సైబర్ నేరగాళ్లు దేన్నీ వదలటం లేదు. ఇప్పుడు కొత్తగా పీఎఫ్ ఖాతాల మీద పడ్డారు. ఆధార్ సహాయంతో పీఎఫ్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా, ఓ వ్యక్తి తన ముఠాతో కలిసి ఆధార్ కార్డుల సమాచారాన్ని తారుమారు చేసి ఇతరుల ఖాతాల్లోని డబ్బులను దోచేశాడు. అలా కోట్ల రూపాయల్లో డబ్బులను కొల్లగొట్టాడు. చివరకు పాపం పండి అరెస్ట్ అయ్యాడు. ఈ సంఘటన ఉత్తర భారత దేశంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఢిల్లీకి చెందిన ప్రియాంషు కుమార్ తన అనుచరులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డాడు. వీరు ఈపీఎఫ్ ఖాతాను ఆధార్తో అనుసంధానం చేసుకోని వ్యక్తులను టార్గెట్ చేసుకున్నారు. వారి ఖాతాల్లోంచి డబ్బులను డ్రా చేయటం కోసం నకిలీ ఆధార్లను సృష్టించారు. మొత్తం 39 నకిలీ ఆధార్లను తయారు చేశారు. ఆ ఆధార్ల సహాయంతో పీఎఫ్ క్లైమ్ చేయసాగారు. అలా మొత్తం 11 పీఎఫ్ ఖాతాల నుంచి రూ.1.83 కోట్లు దోచేశారు. తమ పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు లేకపోవటం గుర్తించిన బాధితులు లబోదిబోమన్నారు. ఈపీఎఫ్వోకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈపీఎఫ్వో స్పందించింది.
సీబీఐకి దీనిపై ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఇది ప్రియాంషు కుమార్, అతడి ముఠా పని అని గుర్తించారు. చాలా పగడ్భందీగా వీళ్లు పీఎఫ్ క్లైమ్ చేసినట్లు కనుగొన్నారు. పక్కా సమాచారంతో బీహార్, జార్ఖండ్, ఢిల్లీలోని ఈ ముఠాకు సంబంధించిన ఎనిమిది ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేసింది. ఈ సోదాల్లో అధికారులు పలు ఆధారాలు లభించాయి. నిందితుడ్ని సైతం అధికారులు అరెస్ట్ చేశారు. మరి, ఆధార్లతో పీఎఫ్ ఖాతాలు దోచేస్తున్న ఈ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.