ఇంట్లో డబ్బులు, నగలు పెడుతుంటే దొంగలు దోచేస్తున్నారనీ, బ్యాంకుల్లో దాచుస్తున్నారు. పోనీ అక్కడైనా మన డబ్బుకు సెక్యూరిటీ ఉందా అంటే కష్టమే. జస్ట్ ఒక్క క్లిక్తో కూడా మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. మన ఫోనులో ఉన్న యాప్స్ ద్వారా దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
ఇంట్లో డబ్బులు, నగలు పెడుతుంటే దొంగలు దోచేస్తున్నారనీ, బ్యాంకుల్లో దాచుస్తున్నారు. పోనీ అక్కడైనా మన డబ్బుకు సెక్యూరిటీ ఉందా అంటే కష్టమే. ఎటీఎం ఎక్స్పెయిర్ అవుతుందంటూ ఫోన్లు చేసి నంబర్, సివివి తెలుసుకుని మొత్తం ఖాతాను లూటీ చేసే దగ్గర నుండి జస్ట్ ఒక్క క్లిక్తో కూడా మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. మన ఫోనులో ఉన్న యాప్స్ ద్వారా దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వీరి తెలివి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఫోన్లు చేయడం లేదా మేసేజ్ల్లో లింకులు పంపడం ద్వారా లూటీ చేస్తున్నారు. దీని మీద టచ్ చేస్తూ చాలు హాం ఫట్ స్వాహానే. ప్రజలు కొంత మేల్కొనే సరికి.. మరో కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు.
సైబర్ నేరగాళ్ల తెలివికి సలాం చేయకుండా ఉండలేం. మోసం చేయడంలో వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నారు. టెక్నాలజీని ఒడిసిపట్టుకుని దోచుకుంటున్నారు. ప్రస్తుతం మరో రకమైన ఆన్ లైన్ దోపిడీకి తెరలేపారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఈ మెయిల్ ఉంటుంది. ఇప్పుడు దీన్నే టార్గెట్ చేశారు నేరగాళ్లు. పెద్ద మొత్తంలో ఈ మెయిల్కు పెద్ద సంఖ్యలో మెయిల్స్ పంపిస్తారు. దీంతో మెయిల్ బాక్స్ నిండిపోతుంది. దీంతో యూజర్.. అవి ఎక్కడ నుండి వచ్చాయని చూడకుండా.. ఓపెన్ చేస్తాడు. దీన్ని ఓపెన్ చేయడం ద్వారా సమాచారాన్ని కొట్టేస్తారు. ఈ మెయిల్స్లో మాస్ మెయిలింగ్, లింకింగ్ లిస్ట్, జిప్ బాంబింగ్ వంటి మూడు పద్ధతులను అనుసరిస్తున్నారు కేటుగాళ్లు.
ఈ ఆన్ లైన్ మోసాల నుండి తప్పించుకోవాలంటే కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు సైబర్ నిపుణులు. మీ బ్యాంకు ఖాతాకు పటిష్టమైన పాస్ వర్డ్ను సెట్ చేసుకోవాలని, అలాగే ఖాతాల నుండి డబ్బు మీకు తెలియకుండా డెబిట్ అయితే కార్డును బ్లాక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే యాప్ల ద్వారా తరచూ నగదు చెల్లింపులు చేయద్దని చెబుతున్నారు. అలాగే ఎటువంటి లింక్స్ క్లిక్ చేయరాదని, వ్యక్తులు, సంస్థలు చెప్పిన అప్లికేషన్లు డౌన్ లోడ్ చేయడం కానీ, ఇన్ స్టాల్ చేయవద్దని పేర్కొంటున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్లను మార్చుకుంటూ ఉండాలని అలాగే బ్యాంకు సంబంధించిన ఎటువంటి వివరాలను ఫోన్లలో పొందు పరచవద్దని చెబుతున్నారు. ఒక వేళ డబ్బులు పొగొట్టుకున్న ఎడల సైబర్ క్రైం హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా 155260 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని వెల్లడించారు.