కాలం ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఒక్కోసారి తెలియకుండానే స్టార్స్ అయిన వారు.. తరువాత కాలంలో ట్రోల్స్ కి గురవుతూ బ్యాడ్ న్యూస్ తో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక గతంలో “బుల్లెట్ బండి” పాటకు ఒక పెళ్లి వేడుకలో భర్తతో కలిసి పెళ్లి కూతురు డాన్స్ వేసింది కదా? సాయి శ్రీయ మీ అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. అయితే .. తాజాగా ఆ పెళ్లికూతురు భర్త అశోక్ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ బడంగ్ పేట్ మున్సిపల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న అశోక్ రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా.. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం అధికారులు అశోక్ ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే.., ఎవరైనా అశోక్ ని ఇలా కావాలని ఇరికించారా? లేదా? నిజంగానే అతను ఇలా లంచాలకు అలవాటు పడ్డాడా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
ఇక “బుల్లెట్ బండి” పాటకు సాయి శ్రీయ డ్యాన్స్ వేశాక ఈ జంట సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యింది. వీరిద్దరూ ఆ సమయంలో చాలా ఇంటర్వూస్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా సాయి శ్రీయని చూసి.. ఆ సమయంలో చాలా మంది పెళ్లికూతుర్లు “బుల్లెట్ బండి పాటకు” డ్యాన్స్ లు వేశారు. ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అయ్యాయి. “బుల్లెట్ బండి” పాటకు పెళ్లి బరాత్ లో డ్యాన్స్ చేసి ఇంత క్రేజ్ తెచ్చుకున్న సాయి శ్రీయకి డ్యాన్సర్ గా బతుకమ్మ సాంగ్ లో ఆఫర్ వచ్చింది. ఇలా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సాయి శ్రీయ భర్త అశోక్.. ఇలా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటం నిజంగా దురదృష్టకరం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.