ఎవరైనా బాగా ఫేమస్ అయితే వెంటనే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని గూగుల్ చేసేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఏ క్రైమ్ లోనో ఇన్వాల్వ్ అయితే ఆ వ్యక్తి గురించి తీవ్రంగా సెర్చ్ చేసేస్తుంటారు. ప్రస్తుతం సాయి శ్రీయ భర్త అశోక్ కూడా తన భార్య ద్వారా పాపులర్ అయ్యారు. అయితే అతన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో సోషల్ మీడియా కళ్లన్నీ అశోక్ మీదనే పడ్డాయి. అసలు ఎవరీ అశోక్? ఎక్కడ నుంచి వచ్చాడు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని ఆరాలు తీయడం మొదలుపెట్టేశారు.
మంచిర్యాల జిల్లా, రామకృష్ణాపూర్ కి చెందిన అశోక్.. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. నేటి జనరేషన్ అమ్మాయిల తల్లిదండ్రులు.. అబ్బాయిలకి ప్రభుత్వ ఉద్యోగం ఉంటేనే తమ పిల్లల్నిచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇదొక కారణం, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే జాబ్ సెక్యూరిటీ అన్న మరొక కారణం. ఈ రెండు కారణాలతో యువత ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో అశోక్ కూడా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని బాగా కష్టపడి చదువుకున్నాడు. అతని కష్టానికి తగ్గట్టు ప్రభుత్వ ఉద్యోగం అతన్ని వరించింది. హైదరాబాద్ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో రెండేళ్ల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉద్యోగం వచ్చింది. మంచి జీతం, మంచి జీవితం. ఇక ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాన్నిస్తే అంతకు మించిన సంతోషం లేదనుకున్నాడు.
కట్ చేస్తే.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయతో వివాహం కుదిరింది. 2021 ఆగస్టు 14న వీరి వివాహం జరిగింది. అయితే అశోక్ కి అప్పటి వరకూ తెలియదు, తాను ఇంతలా ఫేమస్ అవుతాడని. ఒకే ఒక్క పాటతో తాను ఫేమస్ అవ్వడమే గాక అశోక్ ని కూడా పాపులర్ చేశారు సాయి శ్రీయ. వివాహం జరిగిన తర్వాత నిర్వహించిన బరాత్ వేడుకలో సాయి శ్రీయ “బుల్లెట్టు బండి” పాటకు డ్యాన్స్ చేసి భర్తను సర్పైజ్ చేశారు. అది ఆమె స్నేహితులు వీడియో తీసి వాట్సాప్ లోడ్ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ పాటతో అటు సాయి శ్రీయ, ఇటు ఆమె భర్త అశోక్ ఇద్దరూ కూడా బాగా ఫేమస్ అయ్యారు. నెటిజన్లు ఈ దంపతులిద్దరినీ బాగా మెచ్చుకున్నారు. కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దీవించారు. మీడియా ఛానళ్ళు అశోక్ ఇంటికి క్యూ కట్టడం, అశోక్, సాయి శ్రీయ దంపతులు సంతోషం వ్యక్తం చేయడం అన్నీ అలా కుదిరేశాయి.
పెళ్లి తర్వాత దంపతులిద్దరూ వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ వీరికి కొంతమంది సన్మానం కూడా చేశారు. అసలు తన లైఫ్ లో అశోక్ కి తన భార్య వల్ల ఇంత పేరు, ప్రఖ్యాతులు వస్తాయని ఊహించి ఉండడు. ఇక ఈ హడావుడి ముగిసింది. పెళ్లి తర్వాత అశోక్ యధావిధిగా హైదరాబాద్ వచ్చి బడంగ్ పేట్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంతా సవ్యంగా సాగుతుంది. వాళ్ళ లైఫ్ నాలుగు గోడల మధ్య సాగిపోతుంది. ఎవరి పనిలో వారు ఉన్నారు. సడన్ గా ఉన్నట్టుండి అశోక్ ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. ఓ ఇంటి ప్లానింగ్ కి పర్మిషన్ ఇవ్వడం కోసం అశోక్ రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా.. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం అధికారులు అశోక్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంటిలో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం, అందులోనూ టౌన్ ప్లానింగ్ అంటే లంచాలతో కూడుకున్న వ్యవహారం. వద్దన్నా ఇచ్చేవాళ్ళు ఉంటారు. బలవంతం చేసి లంచం ఇచ్చి తమ పనులు చేయించుకుంటారు. అలా లంచాలకు అలవాటు చేసి చివరికి ఇదిగో ఇలా బుక్ చేసేస్తారు. అశోక్ విషయంలో కూడా ఇదే జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అశోక్ ఫేమస్ అవ్వకపోయి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు. కానీ పాపులర్ అవ్వడం వల్లే అశోక్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అశోక్ చేసిన పనికి సాయి శ్రీయ బాధపడుతుంటుంది. ఆమె బుల్లెట్టు బండెక్కి రమ్మని అడిగితే.. నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ ఇదా అంటూ అశోక్ పై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. బ్రైడ్ వల్ల ఫేమస్ అయ్యిండు. బ్రైబ్ వల్ల డీ ఫేమస్ అయ్యిండు. బుల్లెట్టు బండెక్కి రమ్మన్నది లంచం తీస్కోనికా? అంటూ నెటిజన్లు అశోక్ పై కామెంట్లు చేస్తున్నారు. మరి అశోక్ చేసిన పనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.