ప్రముఖ టెలికాం సంస్థ జియో మరోసారి ప్రీపెయిడ్ పాన్ల ధరలను పెంచుతూ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటకే ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా 25 శాతం మేర ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇదే దారిలో వెళ్లింది జియో. ఇక జియోకు సంబంధించి అన్ని రకాల అన్ లిమిటెడ్ ధరలను 21 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ పెరిగిన ధరలను డిసెంబర్ నుంచి అమల్లోకి రానుందని జియో తన ప్రకటనలో తెలిపింది.
ఇక తాజాగా జియో పెంచనున్న ధరలు వివరాలను చూసుకుంటే గనుక.. ప్రాథమిక ప్లాన్కు రూ.75 బదులు డిసెంబర్ 1 నుండి రూ.91 చెల్లించాలి. అలాగే రూ.199 ప్లాన్ (28 రోజులకు 1.5GB/రోజుకు) ధరను రూ.239కు పెంచింది. ఇక దీంతో పాటు రూ.444 ప్లాన్కు రూ.533, రూ.555 ప్లాన్కు రూ.666 చొప్పున చెల్లించాలి. ఇక తాజాగా జియో తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులు షాక్ కు గురవుతున్నారు.
అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టారీఫ్ ధరలను చూసుకుంటే ఈ ధరలతో కంపెనీలు ముందుకు నడవలేవని, దీని కారణంగానే అన్ని ప్రముఖ టెలికాం సంస్థలు పోటిపడుతూ చార్జీలు పెంచేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా జియో చార్జీల పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
In the last Q&A Session we did on 24th Nov https://t.co/exhBCVPvqh I said it was just a matter of time Jio will also increase it’s rates.
It has happened, here are new Jio recharge rates. This would be the case as only 2 big pvt players left in telecom market Jio and Airtel. pic.twitter.com/aD7diGcCBn
— Ranjit (@geekyranjit) November 28, 2021