ప్రముఖ సంచలన టెలీకాం సంస్థ జియో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఇటీవలే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచి షాక్ ఇచ్చిందో లేదో అప్పుడే మూడు ప్లాన్ల రీచార్డ్ లపై క్యాష్బ్యాక్ ఆఫర్ ను ముందుకు తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అంటే 28 నుంచి 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్యాక్స్ పై క్యాష్బ్యాక్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. అదేలగో ఇప్పుడు తెలుసుకుందాం. రూ.299, రూ.666, రూ.719 ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే 20 శాతం క్యాష్బ్యాక్ మూడు రోజుల్లోగా వస్తుంది.
అలా రీచార్జ్ ద్వారా వచ్చిన 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను జియో రీచార్జ్, జియోమార్ట్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్, ఆజియో సహా మిగిలిన రిలయన్స్ స్టోర్లలో ఈ క్యాష్బ్యాక్ ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే గత రెండు రెండు మూడు రోజుల క్రితమే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ తో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉంది జియో సంస్థ. ఇక జియో తాజాగా ప్రకటించిన ప్లాన్లపై 20 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ ను జియో యూజర్లు సద్వినియోగ పరుచుకోవాల్సింది సూచించింది. ఇక జియో తాజా ప్రకటనతో కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.