2022 మినీ వరల్డ్ కప్.. ఓ మహా సంగ్రామాన్నే తలపిస్తోంది. అటు మ్యాచ్ లతో రోజురోజుకు ఉత్కంఠగా సాగుతోంది టోర్నీ. ఇటు వివాదాలతో కూడా టోర్నీ యుద్దాన్ని తలపిస్తోంది. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ టీమిండియాతో పాటు ICC పై కూడా విమర్శలు చేశాడు. ఐసీసీ భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను ఎలాగైన సెమీస్ కు చేర్చాలని ఐసీసీ భావిస్తోందని ఆరోపణలు చేశాడు. తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ లో అంపైర్లు చాలా మ్యాచ్ ల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డాడు అఫ్రిదీ. అఫ్రిదీ వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు BCCI అధ్యక్షుడు రోజర్ బిన్నీ. మాపై ఆరోపణలు చేయడానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని సూటిగా ప్రశ్నించాడు.
ఇండియా-పాక్ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో నో బాల్ వివాదం ఇప్పటికి రగులుతూనే ఉంది. ఇది అంపైర్ల తప్పుడు నిర్ణయం అంటూ పాక్ మాజీ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ సైతం ఆరోపిస్తున్నారు. అదీ కాక బంగ్లా-ఇండియా మ్యాచ్ లో సైతం అంపైర్లు భారత్ కు అనుకూలంగా వ్యవహరించారని అఫ్రిదీ ఆరోపించాడు. ఐసీసీ భారత్ ను సెమీస్ కు పంపాలని చూస్తోంది. దానికి కారణం భారత్ ఆడే మ్యాచ్ లకు ఎక్కువ మెుత్తం లో డబ్బులు వస్తాయి కాబట్టి ICC ఇలా చేస్తోందని అఫ్రిదీ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా అఫ్రిదీ ఆరోపణలపై నోరువిప్పాడు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ. తమిళనాడు క్రికెట్ అసోషియేషన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బిన్నీ అఫ్రిదీ వ్యాఖ్యలపై కౌంటర్ వేశాడు.
ఈ విషయంపై రోజర్ బిన్నీ మాట్లాడుతూ..”అఫ్రిదీ చేసిన ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. మాకు ఐసీసీ సహకరిస్తుందని నేను అనుకోవడంలేదు. అసలు నీకెవరు చెప్పారు మాకు ఐసీసీ సహకరిస్తుందని. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే చూపించండి. అంతే కానీ ఇలా నిందలు వేయడం సరికాదు. వరల్డ్ క్రికెట్ లో టీమిండియా జట్టు ఓ పవర్ హౌజ్. కానీ ఐసీసీ అన్ని జట్లను సమానంగానే పరిగణిస్తుందని” బిన్నీ పేర్కొన్నాడు. అయితే అదృష్టమో.. కాకాతాళియమో తెలీదు కానీ, ఈ వరల్డ్ కప్ లో భారత్ కు అన్ని అనుకూలంగా నే జరుగుతున్నాయి. పాక్ పై కోహ్లీ అడగ్గానే నో బాల్ ఇవ్వడం. బంగ్లాతో మ్యాచ్ లో అంపైర్లు వైడ్ ఇవ్వడం, కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ ను అంపైర్లు గుర్తించకపోవడం వంటివి టీమిండియాకు కలిసొచ్చాయనే చెప్పాలి.