ప్రస్తుతం ఇండియాలో ధనాధన్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ హవా నడుస్తుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తి అయిపోయాయి. ఈ రిచ్ లీగ్కు కావాల్సిన స్టన్నింగ్ స్టార్ట్ లభించింది. లీగ్ రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మలో ఉన్న చాలా లక్షణాలు రిషభ్ పంత్లో కూడా ఉన్నాయని.. భవిష్యత్తులో టీమిండియాను పంత్ నడిపిస్తాడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్గా ఉన్నాడు. వయసు దృశ్య రోహిత్ మరీ ఎక్కువ కాలం కొనసాగలేడు. దీంతో రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్పై ఎవరనే దానిపై చాలా రోజులుగా చర్చ నడుస్తునే ఉంది. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నిజానికి పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును గత ఏడాది సమర్థవంతంగానే నడిపించాడు. అలాగే టీమిండియా కీలక ప్లేయర్గా మారాడు. చాలా మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించాడు.
పంత్ తన ఫామ్ను కొనసాగిస్తూ.. ఐపీఎల్లో ఢిల్లీని విజయపథంలో నడిపించగలిగితే టీమిండియా పగ్గాలు అతని అందడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పంత్ కూడా అందుకు అర్హుడేనని క్రికెట్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మలా బ్యాటింగ్లో టీమిండియాకు వెన్నుముకలా ఉంటూ.. కెప్టెన్గా డేరింగ్ డిసిషన్స్ తీసుకోవడంలో రోహిత్కు, పంత్కు మధ్య సారూప్యత ఉంది. అలాగే ఢిల్లీ కోచ్గా పంత్ను చాలా దగ్గరగా గమనిస్తున్న పాంటింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Sayyad Nag Pasha (@PashaNag) March 27, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.