భారత్ జట్టుపై ఎప్పుడూ ఏదో ఒక నెగిటీవ్ కామెంట్ చేయడం పాకిస్థాన్ ప్లేయర్లకు అలవాటే. ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్లే కాదు.. మాజీలు కూడా భారత్ అంటే కయ్యానికి కాలు దువ్వుతారు. తాజాగా పాకిస్థాన్ మాజీ ఓపెనర్, కెప్టెన్ సల్మాన్ బట్ టీమిండియాపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసాడు.
ప్రపంచంలో టీమిండియా ఎంత బలమైన జట్టు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐసీసీ టోర్నీలు గెలవకపోయినా భారత్ తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి బయపడిపోవాల్సిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొడుతూ ప్రపంచ క్రికెట్ ని కొన్నేళ్ల పాటు శాసించింది. ఒకానొక దశలో టీమిండియా బి జట్టు కూడా అంతర్జాతీయ మ్యాచులాడి విజయం సాధించి అందరిని ఆశ్చర్యపరించింది. ఈ నేపథ్యంలో అప్పట్లో భారత్ సి జట్టు కూడా తయారు చేయాలని బీసీసీఐ భావించింది. ఐపీఎల్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎంతో మంది యంగ్ స్టార్లను తయారు చేసి రానున్న మరో 10 సంవత్సరాలు భారత జట్టుకి డోకా లేదని భరోసా కలిగించింది. అయితే ఇదంతా ఒకప్పుడు. ప్రస్తుతం యంగ్ టీమిండియా పరిస్థితి చూస్తుంటే సీనియర్ ప్లేయర్లు లేకపోతే విజయం అసాధ్యం అనిపిస్తుంది. ఇదే విషయం గురించి మాట్లాడుతో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
భారత్ జట్టుపై ఎప్పుడూ ఏదో ఒక నెగిటీవ్ కామెంట్ చేయడం పాకిస్థాన్ ప్లేయర్లకు అలవాటే. ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్లే కాదు.. మాజీలు కూడా భారత్ అంటే కయ్యానికి కాలు దువ్వుతారు. తాజాగా పాకిస్థాన్ మాజీ ఓపెనర్, కెప్టెన్ సల్మాన్ బట్ టీమిండియాపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసాడు. అయితే సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీమిండియా అభిమానుల్లో కలవరం పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం విండీస్ తో పర్యటనలో ఉన్న టీమిండియా సీనియర్ల గైర్హాజరీలో మొదటి రెండు టీ 20 లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా విండీస్ తో వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డే కూడా ఓడిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సల్మాన్ బట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా లేకపోతే భారత్ విజయాలు సాధించలేదని తేల్చి చెప్పేసాడు.
సల్మాన్ బట్ మాట్లాడుతూ ” జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు లేకపోతే టీమిండియా కూడా బంగ్లాదేశ్ జట్టులా బలహీనంగా కనిపిస్తోంది. ఈ ముగ్గురి అనుభవమే ఇన్ని రోజులు టీమిండియాను కాపాడుకుంటూ వస్తుంది. ఐపీఎల్ కారణంగా భారత జట్టు యువ ప్లేయర్లతో మూడు జట్లను తయారు చేయవచ్చేమో కానీ విజయాలు సాధిస్తుందని నేను అనుకోవడం లేదు. భారత్ ప్లేయర్లను తక్కువ చేసి మాట్లాడాలనేది నా ఉద్దేశ్యం కాదు. కానీ సీనియర్లు లేకపోతే టీమ్లో నాణ్యత లోపిస్తుందనేది మాత్రం వాస్తవం. సత్తా చాటే ప్లేయర్లకు కొదువ లేకపోయినా.. ఒత్తిడిని అధిగమించడం కుర్రాళ్లకు తెలియదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ధోనీ వంటి సీనియర్లతో ఎంతో కాలం ఆడిన తర్వాత స్టార్ ప్లేయర్లుగా మారారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడే భవిష్యత్తు స్టార్లపై క్లారిటీ వస్తుంది” అని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.