డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. మ్యాచ్లో ఓడిన టీమిండియాతో పాటు గెలిచిన ఆసీస్కూ గట్టి షాక్ ఇచ్చింది ఐసీసీ.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కప్ను ముద్దాడాలన్న భారత జట్టు కల నెరవేరలేదు. తుదిమెట్టుపై తడబడ్డ టీమిండియా.. మరో ఐసీసీ ట్రోఫీని సమర్పించేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ ఫైట్లో ఘోర ఓటమితో ఫ్యాన్స్కు తీరని బాధను మిగిల్చింది. ఈ పరాజయానికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఫెయిల్యూర్ వల్లే భారత్ ఓడిపోయిందని కొందరు విమర్శకులు అంటుంటే.. ఈ మ్యాచ్కు జట్టు సెలక్షన్ దగ్గర నుంచి ఆటతీరు వరకు చాలా తప్పిదాలు చేయడం వల్లే ఓడిపోయిందని మరికొందరు క్రిటిక్స్ అంటున్నారు. జాతీయ జట్టుకు ఆడటం కంటే ప్లేయర్లకు ఏదీ ముఖ్యం కాదని.. టీమ్లోని సీనియర్ ఆటగాళ్లు ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ముందు నుంచి ప్రిపేర్ అయితే బాగుండేదని చెబుతున్నారు.
మ్యాచ్ ప్రిపరేషన్, ప్రాక్టీస్కు తగినంత టైమ్ లేకపోవడం.. ఐపీఎల్లో ఆడి విశ్రాంతి లేకుండా వచ్చి నేరుగా ఫైనల్లో ఆడటం కూడా టీమిండియా ఓటమికి కారణాలని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు దాదాపుగా ఒక నెల రోజుల పాటు క్రికెట్కు దూరంగా ఉండనున్నారు. వచ్చే నెల రోజుల పాటు ఎలాంటి మ్యాచ్లు లేకపోవడంతో వాళ్లు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నెల రోజుల రెస్ట్ ముందే దొరికి.. మంచి ప్రిపరేషన్, సరిగ్గా ప్రాక్టీస్ చేసి వచ్చి ఉంటే ఆసీస్తో మ్యాచ్లో గెలిచేవాళ్లమని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. కంగారూలతో ప్రతిష్టాత్మక ఫైనల్లో ఓడి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. భారత జట్టుకు స్లో ఓవర్ రేట్ కారణంగా భారీ ఫైన్ వేసింది. మ్యాచ్ ఫీజులో రోహిత్ సేన మొత్తానికి 100 శాతం కోత విధించింది. కప్ గెలిచిన ఆసీస్కూ జరిమానా తప్పలేదు. ఆ టీమ్కు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా వారి మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత వేసింది.
నిర్ణీత టైమ్లో టీమిండియా 5 ఓవర్లు, ఆసీస్ 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేశాయని ఐసీసీ తెలిపింది. వంద శాతం ఫీజు కోత వల్ల భారత ప్లేయర్లకు ఈ మ్యాచ్ ద్వారా ఒక్క రూపాయి కూడా దక్కదు. ఇక, భారత ఓపెనర్ శుబ్మన్ గిల్కు ఎక్స్ట్రా ఫైన్ పడింది. రెండో ఇన్నింగ్స్లో ఔట్ అయిన తర్వాత అంపైర్ డెసిజన్పై అసమ్మతి వ్యక్తం చేసినందుకు గానూ గిల్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఈ లెక్కన గిల్కు 115 శాతం జరిమానా పడింది. కాగా, తన ఔట్పై అంపైర్ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో గిల్ ఒక పోస్ట్ పెట్టాడు. ఐసీసీ ఆర్టికల్ 2.7 (ఇంటర్నేషనల్ మ్యాచ్లో జరిగిన ఘటనపై బహిరంగ విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు) రూల్ కింద శుబ్మన్ చేసింది తప్పేనని ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మరి.. గిల్కు ఫైన్ వేస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India fined 100% and Australia fined 80% of their match fees for maintaining slow overrate in the WTC Final. pic.twitter.com/5iWbSJFWx9
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 12, 2023
Shubman Gill fined 115% of his match fees for maintaining slow overrate (100%) and showing dissent over the 3rd umpire’s decision (15%). pic.twitter.com/k1vNDWOyYW
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 12, 2023