కే.ఎస్ భరత్.. ఈ పేరు వినగానే అందరికీ ఐపీల్ ల్లో ఒకటే మ్యాచ్ గుర్తొస్తుంది. ఆర్సీబీ తరఫున లక్నో సూపర్ జెయింట్స్ పై చివరి బంతికి 5 పరుగులు కావాల్సిన దశలో.. సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించిన సంగతే గుర్తుచేసుకుంటారు. ఆ మ్యాచ్ లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత భరత్ అంచలంచెలుగా ఎదుగుతూ ఈరోజు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. నాగ్ పూర్ వేదికగా గురువారం ప్రారంభమైన భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్టు మ్యాచులో భరత్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో చోటు దక్కించుకోవడంపై తెలుగు అభిమానులే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆనందం వ్యక్తం చేశారు. భరత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
“ఈరోజు జరుగుతున్న ఆస్ట్రేలియా- టీమిండియా టెస్టు మ్యాచులో మన కేఎస్ భరత్ అరంగేట్రం చేయడం ఆనందంగా ఉంది. కేఎస్ భరత్ కు నా శుభాకాంక్షలు.” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా భరత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. “మన కుర్రాడు కేఎస్ భరత్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో టెస్టుల్లో అరంగేట్రం చేశాడని తెలుసుకుని సంతోషంగా ఉంది. భరత్ కు శుభాకాంక్షలు. అతడు మన దేశాన్ని గర్వపడేలా చేస్తాడని ఆకాంక్షిస్తున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కూడా భరత్ ను అభినందించారు. “భరత్.. నువ్వు ఎంతో ప్రత్యేకం. ఆల్ ది బెస్ట్.. నీ బెస్ట్ ఇవ్వు.. రిజల్ట్ కూడా బెస్ట్ గా నే వస్తుంది” అంటూ రోజా ట్వీట్ చేశారు.
Our very own @KonaBharat is debuting today with the Indian Cricket Team in the ongoing test against Australia. My congratulations and best wishes to him.
The Telugu flag continues to fly high!#TeluguPride pic.twitter.com/KlDACbHBhF— YS Jagan Mohan Reddy (@ysjagan) February 9, 2023
కేఎస్ భరత్ కెరీర్ విషయానికి వస్తే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆంధ్రా తరఫున పలు రికార్డులు తన పేరిట ఉన్నాయి. కెరీర్లో ఒక ట్రిపుల్ సెంచరీ సాధించిన భరత్.. తాను కూడా జాతీయ జట్టుకి అర్హుడునేనని సెలెక్టర్లకి చెప్పకనే చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో ఒక వికెట్ కీపర్ ట్రిపుల్ సెంచరీ చేయడం అదే తొలిసారి. అందుకే తన అద్భుతమైన ప్రతిభతో జాతియ జట్టులో చేరాడు. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. దీంతో టెస్టుల్లో ఒక స్పెషలిస్ట్ వికెట్ కీపర్ గా తుది జట్టులో స్థానం దక్కించుకోవడం చాలా కష్టమని భావిచారు. కానీ రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ జట్టుకు దూరం కావడంతో.. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ అవకాశం దక్కించుకున్నాడు.
Happy to learn that our very own @KonaBharat will make his debut in the first cricket test against Australia today. I wish him all the very best and look forward to seeing him make our country proud. pic.twitter.com/enVRQjr2fV
— N Chandrababu Naidu (@ncbn) February 9, 2023
You are absolutely unique and all the best @KonaBharat give your best, see result will be TheBest 🏏 #INDvsAUS pic.twitter.com/E3v7LI0PUg
— Roja Selvamani (@RojaSelvamaniRK) February 8, 2023