Ajinkya Rahane, WTC Final: కెప్టెన్ గా కోహ్లీ అందుబాటులో లేనప్పుడు వైస్ కెప్టెన్ గా రహానే ఆ బాధ్యతలు తీసుకునేవాడు. ఇప్పటివరకు రహానే కెప్టెన్సీలో టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కెప్టెన్గా 2020-21 ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా కి చారిత్రాత్మక విజయాన్నందించాడు.
అవకాశం ఎప్పుడు ఏ రూపంలో వరిస్తుందో చెప్పడం కష్టం. కొన్నిసార్లు అనుకుంటే రాని అవకాశం.. అనుకోకుండా మన దగ్గరకి వచ్చి చేరుతుంది. టెస్టుల్లో ఒకప్పడు టీమిండియాకు వైస్ కెప్టెన్ అజింక్య రహానే పరిస్థితి ఇలాగే ఉంది. టెస్టు జట్టులో ఇక తలుపులు మూసుకుపోయినట్లే అనుకుంటున్న తరుణంలో ఒక్క ఇన్నింగ్స్ తో ఏకంగా WTC రేసులోకి వచ్చేసాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రహానే చెలరేగి ఆడటంతో.. ఇప్పుడు WTC ఫైనల్ కి ఎంపిక చేసే 15 మంది ప్రాబబుల్స్ లో ఈ ముంబై బ్యాటర్ ఉంటాడని సమాచారం.
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన ఐపీఎల్ హడావుడే కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ తర్వాత టీమిండియా.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక WTC ఫైనల్స్ ఆడాల్సి ఉంది. జూన్ 7-11 వరకు జరిగే ఈ ఫైనల్ ఇంగ్గండ్లోని ఒవెల్లో జరుగనుంది. స్టార్ ప్లేయర్లు బూమ్రా, శ్రేయాస్ అయ్యర్, పంత్ ఈ ఫైనల్ కి అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఇప్పుడు సెలెక్టర్లు మిడిల్ ఆర్డర్ లో ఎవరిని సెలెక్ట్ చేయాలనే విషయంలో కాస్త గందరగోళంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రహానే WTC ఫైనల్ కి ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అదెలాగంటే..
టెస్టు స్పెషలిస్ట్ గా పేరున్న రహానే ఐపీఎల్లో అమ్ముడుపోవడమే ఎక్కువని భావించారు. ఇక చెన్నై జట్టులో స్టార్లు ఉండడంతో తుది జట్టులో ప్లేస్ దక్కడం దాదాపు కష్టమే అనుకున్నారు. ఒకవేళ ప్లేస్ లభించిన నిరూపించుకోవడం దాదాపు అసాధ్యం అనే ఆలోచనలో ఉన్నారు. కానీ వీటన్నిటిని పటాపంచలు చేస్తూ.. ఒక్క సునామీ ఇన్నింగ్స్ తో అందరిని తన వైపుకి తిప్పుకున్నాడు ఈ ముంబైకర్. ప్రస్తుతం చెన్నై జట్టుకి ఆడుతున్న రహానే.. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 27 బంతుల్లో 61 పరుగులు చేసి ఊహించని షాక్ ఇచ్చాడు.
గత దశాబ్ద కాలంగా టీమిండియా టెస్టు జట్టులో రహానే కీలక ప్లేయర్. కెప్టెన్ గా కోహ్లీ అందుబాటులో లేనప్పుడు వైస్ కెప్టెన్ గా రహానే ఆ బాధ్యతలు తీసుకునేవాడు. ఇప్పటివరకు రహానే కెప్టెన్సీలో టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కెప్టెన్గా 2020-21 ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా కి చారిత్రాత్మక విజయాన్నందించాడు. చివరిగా 2022 లో దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ ఆడిన రహానే.. ఫేలవ ఫామ్ తో టీమిండియాలో చోటు కోల్పోయాడు. అయినా.. జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా రంజీ మ్యాచుల్లో తనను తాను నిరూపించుకున్నాడు. అయితే..టెస్టుల్లో శ్రేయాస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో సెట్ అయిపోవడంతో ఇక రహానే పునరాగమనం కష్టమే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అయ్యర్, పంత్ గాయాలతో రహానేకు టెస్టుల్లో చోటు లభించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. రహానే కి అనుభవంతో పాటుగా విదేశాల్లో మంచి రికార్డ్ కలిగి ఉండడం కలిసి వస్తుంది. మరి రహానే తిరిగి టెస్టు జట్టులో స్థానం సంపాదిస్తాడో లేదో కామెంట్ల రూపంలో తెలపండి.
There is a spot available in India’s middle order – could we see Ajinkya Rahane at the WTC final? https://t.co/XJMPpCbod5 pic.twitter.com/2a2Hsdw4JK
— ESPNcricinfo (@ESPNcricinfo) April 10, 2023