‘ఐసీసీ టీ20 వరల్డ్కప్’లో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం పాకిస్తాన్ చేతిలో పది వికెట్ల తేడాతో ఘోర పరాభవం చవి చూశారు. భారత్ క్రికెట్ అభిమానులు మాత్రం గెలిచినా.. ఓడినా మేము మీ వెంటే అంటూ టీమిండియాకు సపోర్ట్గా నిలిచారు. భారత్ తర్వాత న్యూజిలాండ్తో తలపడనుంది. ఈ తరుణంలో మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. గాయం కారణంగా స్టార్ ఆలౌండర్, పవర్ హిట్టర్ హార్దిక్ పాండ్యా జట్టు నుంచి తప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్తో మ్యాచ్ మధ్యలో అతని భుజానికి గాయం అయ్యింది. తర్వాత ఫీల్డింగ్కు కూడా రాలేదు. అతని ప్లేస్లో ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. హార్దిక్ను స్కానింగ్ కోసం పంపినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చదవండి: ప్రియ ఎలిమినేషన్ వెనుక కుట్ర జరిగిందా? తప్పు ఎవరిది?
హార్దిక్ పాండ్యా తర్వాతి మ్యాచ్ ఆడతాడా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం అయితే ఇంకా రాలేదు. అధికారికంగా కూడా అతని గాయం తీవ్రత గురించి ఎవరూ ప్రకటించలేదు. కానీ, ఫీల్డింగ్కు కూడా రాకపోవడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. లీగ్ మ్యాచ్లే నడుస్తున్నాయి కాబట్టి హార్దిక్ను అలాగే ఆడించి రిస్క్ తీసుకుంటారని అనుకోవట్లేదు. హార్దిక్ పాండ్యాకు కచ్చితంగా తగిన విశ్రాంతి ఇస్తారనే తెలుస్తోంది. మరోవైపు ప్రదర్శన పరంగా చూసినా కూడా హార్దిక్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తాడనే అనుమానాలు, వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా చూసినా హార్దిక్ పాండ్యా జట్టులో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. హార్దిక్ స్థానంలో ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.