ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ- కాంగ్రెస్ పార్టీ నడుమ విమర్శలు జోరందుకున్నాయి. కేంద్ర మంత్రులు సైతం కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ పార్టీపై వింత విమర్శలు చేశారు.
బీజేపీ- కాంగ్రెస్ మధ్య రాజకీయ వేడి రాజుకొంది. ఇరు పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్నారు. కర్ణాటకలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ- కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశాలు, యాత్రలు అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కర్ణాటకలో తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి నేరుగా ఢిల్లీ నుంచి కూడా నేతలు సమావేశాలు, ర్యాలీలకు హాజరవుతున్నారు. తమ మీటింగులలో ఓటర్లపై పోటా పోటీగా హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇస్తానన్న హామీపై కేంద్ర మంత్రి పలు విమర్శలు చేశారు. “కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇస్తానంటోంది. కాంగ్రెస్ వాళ్లు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ప్రజలు నమ్ముతారా? మేదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే 24 గంటల విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లే అసలు గ్రామాల్లో విద్యుత్ కూడా ఉండేది కాదు. కాంగ్రెస్ వాళ్లు సరిగ్గా విద్యుత్ ఇవ్వకపోవడం వల్లే.. వారి పాలనలో కర్ణాటకలో జనాభా పెరింది” అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వింతగా విమర్శించారు. కేంద్రమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ట్వీట్ కు లాఫింగ్ ఏమోజీలను జత చేశారు. కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ్ల.. కాంగ్రెస్ పార్టీ పలు హామీలను ఇచ్చింది. వాటిలో ఓటర్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
— KTR (@KTRBRS) March 9, 2023