రాజకీయ నాయకులు సభలు, ర్యాలీలు, మీటింగ్స్ లల్లో పాల్గొన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఏదైన మాట పొరపాటున జారినా గానీ వెంటనే సరిదిద్దుకోవాలి. లేదంటే ఆ తప్పుడు మాట ప్రజల్లోకి వెళితె.. తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. తమ నోటి దురుసు కారణంగా ఇప్పటికే చాలా మంది నాయకులు విమర్శలకు గురైన సంఘటనలు దేశంలో చాలానే చూశాం. తాజాగా మరో ప్రజాప్రతినిధి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైయ్యాడు. భారతీయ సంస్కృతిలో ఐదుగురు భర్తలు ఒకే భార్యను పంచుకోవచ్చని వ్యాఖ్యనించాడు ఆ ఎమ్మెల్యే.
చాలా మంది ప్రజాప్రతినిధులు తమ నోటి దురుసుతో తరచుగా వివాదాల్లో చిక్కుకుంటుంటారు. తాజాగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరో సారి తన నోటి దురుసును బయటపెట్టాడు టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా. వివరాల్లోకి వెళితె.. పశ్చిమ బెంగాల్ లో పాఠశాలలో నడుస్తున్న మధ్యాహ్న భోజనం పథకం అమలుపై కేంద్ర విద్యాశాఖ బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో ఈ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఐదుగురు వంట సిబ్బందికి కేటాయించిన నిధులను ప్రభుత్వం ఏడుగురికి సమానంగా పంచుతోందని అధికారులు కనిపెట్టారు. దీనిపై వ్యంగ్యంగా స్పందించాడు TMC ఎమ్మెల్యేమదన్ మిత్రా. భారతీయ సంస్కృతిలో ఐదురుగు కలిసి ఒకే భార్యను పంచుకుంటారని అన్నాడు. అంటే డబ్బులు పంచుకోవడంలో తప్పులేదని ఆ ఎమ్మెల్యే వాదన అన్నమాట.
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి గౌరవం దక్కుతుందో మదన్ మిత్రా వ్యాఖ్యలే నిదర్శనం అని ఎమ్మెల్యే , నటి అగ్నిమిత్ర పాల్ ఎద్దేవచేశారు. ఇక సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు కూడా ఫైర్ అయ్యారు. ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సూచించారు. అయితే గతంలో కూడా మదన్ మిత్ర ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. మరి మహిళలపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసిన సదరు ఎమ్మెల్యే పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.