కొంతమంది డబ్బు కోసం ఎంతటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తూ తాము ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ మద్య డబ్బు కోసం చాలా మంది ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. మాయమాటలు చెబుతూ ఎదుటివారిని బుట్టలో వేసుకొని అందినంత దోచుకుంటున్నారు. ఎవరికైనా సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఉంటుంది. ఆ బలహీనతను కొంతమంది క్యాష్ చేసుకుంటూ తక్కువ ధరకే భూములు, ఫ్లాట్లు, ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేస్తూ ఉడాయిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి పోలీస్, పొలిటికల్ సపోర్ట్ ఉండటంతో సామాన్యపౌరులు తమకు జరిగిన నష్టాన్ని తల్చుకొని కుమిలిపోతుంటారు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అచ్చం ఇలాంటి మోసాని పాల్పపడిందని మహిళా ఎంపీ, నటి పై కొంతమంది ఏకంగా ఈడీకే ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
తృణముల్ ఎంపీ, ప్రముఖ నటి నుస్రత్ జహాన్ సొంత ఇళ్లు కట్టిస్తామని తమ వద్ద డబ్బు తీసుకొని ఇప్పటి వరకు కట్టించకుండా ముఖం చాటేస్తుందని.. అడిగితే బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాలు జిల్లా కు చెందిన కొంతమంది బాధితులు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 429 మంది వద్ద నుంచి ఇల్లు కట్టిస్తామంటూ దాదాపు రూ.28 కోట్ల మేర కాజేసినట్లు ఆరోపించారు. కేవలం రూ.6 లక్షలకే త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని డబ్బులు వసూలు చేసి ఐదేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని వాపోయారు. దీంతో తాము దారుణంగా మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. అలాగే ఆమె చేసిన దారుణమైన మోసాల గురించి సాల్ట్ లేక్ ఈడీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు.
గతంలో ఈ వ్యవహారంపై కోర్టులో కేసు దాఖలైంది. అయితే ఈ కేసు విషయంలో ఎంపీ నుస్రత్ జహాన్ కోర్టుకు హాజరు కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని.. ఈ క్రమంలోనే ఆమె వ్యవహారం గురించి ఈడిని ఆశ్రయించామని బాధితులు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారం గురించి ఎంపీ నుస్రత్ జహాన్ ఇప్పటి వరకు స్పందించలేదు. సుస్రత్ బెంగాలీ ఇండస్ట్రీలో సినీ నటిగా కొనసాగారు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున బసిర్హాట్ నియోజకవర్గం ఎంపీగా గెలిచారు. గతంలో ఓ కేసులో నిందితుడికి ఆశ్రయం ఇచ్చినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.