‘ఎంపీ కేశినేని’ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ట్రావెల్ బిజినెస్ నుంచి తిరుగులేని నాయకుడిగా ఎదిగారాయన. రాష్ట్రం మొత్తం తెదేపాకి వ్యతిరేక ఫలితాలు వచ్చినా.. నిలబడి గెలిచి చూపించారు. రెండు సార్లు ఎంపీగా తెదేపాకు ఎన్నో సేవలు చేశారు. రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉండే ఎంపీ కేశినేని నాని ప్రస్తుతం కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. టీడీపీ కార్యాలయానికి దూరంగా ఉంటున్న కేశినేని ప్రస్తుతం ప్రజలతోనూ కలుస్తున్నది లేదు. యాక్టవ్ పాలిటిక్స్ చాలా దూరంపాటిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లోనే రాజకీయాలకు దూరంకానున్నట్లు తెలపగా.. చంద్రబాబు బలవంతం మీద పోటీ చేసి రెండోసారి ఎంపీగా గెలిచారు కేశినేని నాని. ప్రస్తుతం మళ్లీ అదే ధోరణి, వ్యవహార శైలి కనిపిస్తోంది.
కేశినేని నాని పెద్దగా కనిపించకపోవడం ఇప్పుడు విజయవాడలో పెద్ద టాక్ అయ్యింది. ఈసారి మాత్రం నిజంగానే రాజకీయాలకు దూరంకానున్నట్లు గట్టిగా చెప్పారని తెలుస్తోంది. నిర్ణయం తీసుకోవడమే కాదు.. అధినేత చంద్రబాబుకు కూడా ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఈసారి ఎన్నికల కోసం అభ్యర్థిని సిద్ధం చేసుకోవాలని సూచించారని తెలిసింది. ఆయన కుమార్తె శ్వేత చౌదరి టాటా ట్రస్టులోకి వెళ్లిపోయారు. ఆమె కూడా రాజకీయాలకు దూరంకానున్నట్లు కనిపిస్తోంది. కేశినేని నాని కమలంతో జత కడతారు అని పుకార్లు వచ్చినప్పుడు నో కామెంట్ అన్నారు. ఇప్పుడు కూడా సైకిల్ దిగే ప్రసక్తే లేదు అంటున్నారు. రాజకీయాలకు దూరమైనా టీడీపీతో సంబంధాలు తెగిపోవని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరి, అదే నిజమైతే కేశినేని నాని ప్లేస్ను ఎవరు భర్తీ చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారబోతోంది. ఎవరు ఆ స్థానంలో పోటీ చేస్తారనే దానిపై విజయవాడలో జోరుగా పుకార్లు మొదలయ్యాయి.
కేశినేని నాని రాజకీయ సన్యాసం చేయబోతున్నారా? ఆ స్థానంలో ఎవరు పోటీ చేస్తే బావుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.