ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటారు. రాష్ట్ర ప్రజల కొరకు అనేక కార్యక్రమాలను చేపట్టి.. వాటిని అమలు పరుస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఫలితాలు అందేలా పాటుపడుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటారు. రాష్ట్ర ప్రజల కొరకు అనేక కార్యక్రమాలను చేపట్టి.. వాటిని అమలు పరుస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఫలితాలు అందేలా పాటుపడుతున్నారు. ప్రజలకు సేవ చేయుటకే నిరంతరం తపించే వ్యక్తి జగన్. రాజకీయంగా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా చిరునవ్వుతో అధిగమించే జగనన్నకు ఆరోగ్యపరంగా ఏమైదనే విషయం తెలుసుకుందాం. తాజాగా ఏపీ సీఎం జగన్ విజయవాడ మొగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అసలు ముఖ్యమంత్రి ఆరోగ్యానికి ఏమైందన్న విషయానికి వస్తే ..
విజయవాడలో మొగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్లో సీఎం జగన్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ల్యాబ్ లో దాదాపుగా రెండు గంటలపాటు ఉన్నారు. కాలి మడమ నొప్పితో సీఎం జగన్ బాధపడుతున్నారు. ఆయనకు మెడికల్ టెస్టులు జరిపిన డాక్టర్లు.. ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించారు. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సీఎం జగన్ కొంతకాలంగా కాలి మడమ నొప్పికి చికిత్స చేయించుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. వ్యాయామం చేస్తున్నప్పుడు కాలు బెనికిందని.. విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గిపోతుందని డాక్టర్లు సూచించారు. దీని కోసం టెస్టులు చేశారని డాక్టర్లు తెలిపారు.