అమ్మను మించిన దైవం లేదు అంటారు. తన రక్తాన్ని పాలుగా మార్చి అందించి మనల్ని బతికిస్తుంది కన్నతల్లి. అయితే ఏ బంధం లేకపోయినా కూడా ఎందరో పసిపిల్లలకు తమ పాలను అందించి ప్రాణాలను నిలుపుతున్న మాతృమూర్తుల గురించి తెలుసుకుందాం..
పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటివి. పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు పట్టించడంతో పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. దీనితోపాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా లభిస్తుంది. తల్లిపాలు పట్టడం ద్వారా బిడ్డతోపాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టిన బిడ్డకు అరగంటలోపు పాలు పట్టిస్తే బిడ్డ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. తల్లిపాల ప్రాముఖ్యతను గురించి అంగన్ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ప్రతి గర్భిణి స్త్రీకి తెలియజేస్తారు. మహిళా శివు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలియపరుచుటకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత గల తల్లిపాలను తన బిడ్డకు ఇవ్వడమే కాకుండా ఇతరు బిడ్డలకు కూడా ఆకలి తీర్చిన మాతృమూర్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మానవతా దృక్ఫథంతో ఇద్దరు తల్లులు తల్లిపాలను దానం చేశారు. ఎంతోమంది తల్లిపాలు లేని చిన్నారులకు పాలను అందించిన కరుణా మూర్తులు. వారిలో ఒక తల్లిపేరు హరిత. ఆమె తన నుండి 70 లీటర్ల పాలను దానంగా ఇచ్చింది. మరో తల్లిపేరు రచన ఈమె తన 30 లీటర్ల పాలను పసిపిల్లలకు అందించి చాలామంది చిన్నారులకు తల్లులయ్యారు. వీరు రెయిన్ బో ఆస్పటల్, విజయవాడ వారి సహకారంతో పాలను సేకరించి ఇవ్వడం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది ప్రిజర్వ్ చేసుకుని చాలామంది తల్లిపాలు లేని పసిపిల్లలకు వీరి పాలను పడుతున్నారు.
ఈ సందర్భంగా హరిత మాట్లాడుతూ.. తనకు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు తల్లిపాలను కొన్ని కారణాలచేత ఇవ్వలేకపోయానని చెప్పింది. రెండోసారి పాప పుట్టినప్పుడు పాలు ఎక్కువగా ఉన్నాయని, తన పాపకు సరిపోయినన్ని పాలు తీసుకుని మిగిలిన పాలను దానం చేశానని చెప్పింది. మనదేశంలో చాలామంది న్యూ బర్న్ బేబీస్ మిల్క్ లేక సఫర్ అవుతున్నారని వారికి తన పాలు ఉపయోగపడతాయని పాలను దానం చేశానని తెలిపింది. విజయవాడలో మిల్స్ డొనేషన్ బ్యాంక్స్ లేవు. రెయిన్ బో ఆస్పటల్ సిబ్బందికి తెలియజేయగా వారు పాలను కటెక్ట్ చేసుకున్నారు. పాలను ఇచ్చేందుకు మనం వేరే చోటుకు వెళ్లాల్సిన పనిలేదు. వారే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఇలా వందలమంది పిల్లలకు తన పాలు అందివ్వడం చాలా హాపీగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మొదట తన పాపకు థాంక్స్ చెప్పాలి.. ఎందుకంటే తనపాప వల్లే తాను ఈ మంచిపని చేయగలిగానని హరిత తెలిపింది. ప్రతి తల్లి వారి పిల్లలకు సరిపోగా పాలను వీలైనంత వరకు తల్లిపాలను దానం చేసి పసిపిల్లలను కాపాడమని కోరింది.
ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు రక్త దానం, అవయవ దానం సరైన సమయంలో ఇచ్చి వారిని కాపాడుతారు. అదే కోవలో తల్లిపాలను కూడా దానం చేసి తల్లి గొప్పతనాన్ని చాటారు ఈ ఇద్దరు తల్లులు. ఈ ఇద్దరు మాతృమూర్తులు చేసిన మంచిపనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.