దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిది అంబేద్కర్, జ్యోతి బా పూలే, నారాయణ గురులతో పోల్చే స్థాయి కాదని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. మహనీయులకు గౌరవం ఇస్తున్నట్లు మభ్యపెట్టి మధ్యలోకి వైఎస్సార్ పేరును తేవటాన్ని ఆయన తప్పు బట్టారు. దీనిపై గట్టిగా ప్రశ్నించారు. బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై వైసీపీ సర్కార్ వివక్ష రాష్ట్ర స్థాయి సదస్సులో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘‘ బ్రిడ్జి దాటగానే ఆత్మకూరు గ్రామ పంచాయతీ దగ్గర హైవేనుంచి వస్తా ఉన్నా..
చూస్తే.. జ్యోతీ బా పూలే, డాక్టర్ వైఎస్సార్ ముఖ ద్వారం అని రాసి ఉంది. వైఎస్సార్ గారు గొప్ప వారే నేను కాదనను. ఆయన చేశారు. ఆయనకు అనుభవం ఉంది. కానీ, ఆయనకు జ్యోతీ బా పూలేతో పోలిక కాదు. బాబా సాహేబ్ అంబేద్కర్తో పోలిక కాదు. నారాయణ గురులతో పోలిక కాదు. సాహూ మహరాజ్తో పోలీక కాదు. ఈయన అర్థం చేసుకోవాలి. ఎక్కడో ఓ చోట చిన్నదే అయి ఉండొచ్చు. జ్యోతి బా పూలే, వైఎస్సార్ పేరు చిన్నదే అయి ఉండొచ్చు. చూసే వాళ్లకు అది తట్టక పోవచ్చు. కానీ, నేను ఏం ఆలోచిస్తానంటే.. దాని వెనుక నీ ముఖ్య ఉద్ధేశ్యం చెప్పు.
అంటే నువ్వు పూర్తి మర్యాద ఇవ్వవు. పేర్లు మధ్యలోకి వచ్చేస్తాయి. మేము అనుకుంటున్నది.. జ్యోతీ బా పూలే గారిది అంటే.. జ్యోతి బా పూలే గారిదే.. ఎవరిదీ ఉండకూడదు. గౌరవం ఇస్తే.. సంపూర్ణ గౌరవం ఇవ్వు. ఆదా, ఆదా గౌరవాలు ఇవ్వకు’’ అని అన్నారు. కాగా, పవన్ బుధవారం తన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి విజయవాడ కనక దుర్గ గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేయించారు. ఆయన కూడా గుడిలోకి వెళ్లి అమ్మవారికి పూజలు చేశారు. ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు. మరి, వైఎస్సార్ పేరును జ్యోతి బా పూలేతో పోలిక పెట్టవద్దన్న పవన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
అంబేద్కర్, జ్యోతి బా పూలే, నారాయణ గురు గార్లతో వైయస్ రాజశేఖర్ రెడ్డి పోల్చే స్థాయి కాదు. మహనీయులకు గౌరవం ఇస్తున్నట్లు మభ్యపెట్టి మధ్యలో YSR పేరును పెట్టడంలో వైసిపి ఆంతర్యం ఏంటి? ఏం రుద్దాలని చూస్తున్నారు – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/PfoJprlf5n
— JanaSena Party (@JanaSenaParty) January 26, 2023