ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ వ్యవహారం అధికార వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో క్యాబినేట్ లో మార్పులు చేర్పులు ఉంటాయని, ఇటీవల జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో స్వయంగా సీఎం జగన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. దీంతో సరికొత్త అంశాలు తెరమీదకు వస్తున్నాయి. స్పీకర్ పదవి మహిళకు కేటాయిస్తారని, ప్రస్తుత ఉన్న తమ్మినేని సీతారాంకి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందనే మాటల వినిపిస్తున్నాయి.
2024 ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా.. ఇప్పటి నుంచే ఆచితూచి అడుగులు వేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇదే సమయంలో.. కొత్త మంత్రివర్గంలో ఇప్పుడు ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే దాని పైన.. అధికార పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తొలి విడత కేబినెట్ కూర్పులో ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాంకి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం సాగింది. శ్రీకాకుళం జిల్లా బీసీ వర్గానికి చెందిన తమ్మినేనికి అనూహ్యంగా అసెంబ్లీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు. దాంతో ఆయన ఒకింత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఈ దఫాలో ఆయనకు క్యాబినేట్ లో స్థానం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఏపీ శాసన మండలి ఛైర్మన్ గా ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజు ఉన్నారు.
అలాగే డిప్యూటీ ఛైర్మన్ గా మైనార్టీ మహిళా నేత ఉన్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ స్పీకర్ పదవిని బీసీ సామాజిక వర్గాని ఇవ్వాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గతంలో శ్రీకాకుళంగా ఎంపీగా పోటీ చేసి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రెడ్డి శాంతిని స్పీకర్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోపక్క రాయలసీమకు చెందిన మహిళా ఎమ్మెల్కే కూడా రేసులో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మూడేళ్ల కాలంలో స్పీకర్ గా తమ్మినేని సమర్ధవంతంగా వ్యవహరించారనే అభిప్రాయం సీఎం జగన్ తో పాటు పార్టీ నేతల్లో కూడా ఉంది.
కానీ మంత్రిగా పని చేయాలనే తమ్మినేని కోరిక మేరకు మార్పు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తొలి నుంచి మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న జగన్ ఈసారి స్పీకర్ పదవిని స్త్రీలకు కేటాయిస్తారా లేదంటే సీనియర్ నేతలకు ఎవరికైనా అప్పగిస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఊహాగానాలను కొట్టి పారేస్తూ.. మళ్లీ తమ్మినేనినే కొనసాగిస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి..ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.