ఇప్పుడు ఏ విషయంపై స్పందించాలన్న, అభిప్రాయాలను తెలియచేయాలన్నా.. ఎక్కువగా వినియోగిస్తున్న సామాజిక మాధ్యమం ట్విట్టర్. మనకు నచ్చిందీ, తోచిందీ మాట్లాడుతుంటారు దీని ద్వారా.
ఇప్పుడు ఏ విషయంపై స్పందించాలన్న, అభిప్రాయాలను తెలియచేయాలన్నా.. ఎక్కువగా వినియోగిస్తున్న సామాజిక మాధ్యమం ట్విట్టర్. నచ్చిందీ, తోచిందీ మాట్లాడుతుంటారు దీని ద్వారా. బఠానీ ముచ్చట్లు దగ్గర నుండి జాతీయ, అంతర్జాతీయ సమస్యల వరకు అభిప్రాయాలు తెలియజేసేందుకు వేదికైంది ట్విట్టర్. ఇటీవల కాలంలో వివాదాలతో కూడా బాగా పాపులర్ అయ్యింది. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోరీ నుండి కొనుగోలు చేసే ప్రక్రియలో టెస్లా వ్యవస్థాపకుడు, మిలినీయర్ ఎలన్ మస్క్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. చివరకు ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత కూడా మామూలు కథలు చేయలేదు. బ్లూ టిక్స్ తొలగించడం దగ్గర నుండి పలు మార్పులు, చేర్పులు తీసుకువచ్చారు.
అయితే ఇప్పుడు ట్విట్టర్ కొత్త ఫీచర్ను తీసకువచ్చింది. గతంలో ట్వీట్ చేయాలంటే అక్షరాలకు పరిమితి ఉండేది. గతంలో 140 అక్షరాలే రాసే వీలుండగా.. 2018లో అక్షరాల సంఖ్యను 280కి పెంచింది. అయితే మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఇప్పుడు ఆర్టికల్స్ పేరుతో కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నారు. ఈ ఫీచర్ తో యూజర్లు ఇక పెద్ద పెద్ద వ్యాసాలు ట్వీట్ చేయొచ్చు, రాయోచ్చు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. తర్వలో రాబోయే ఈ ఫీచర్తో అక్షరాల పరిమితికి చెక్ పడినట్లే. ఇక ట్వీట్ల రూపంలో ఏదైనా చెప్పాలంటే.. పది ట్వీట్లు చేయనక్కర్లేదు. పుంకాను పుంకాలు రాసుకోవచ్చు. ఓ చిన్న పుస్తకమే రాయోచ్చేమో చూడాలి. దీని వల్ల కంటెంట్ క్రియేటర్లకు ఇదొక సువర్ణావకాశమనే చెప్పాలి.
ట్విట్టర్ కొనుగోలు తర్వాత ఎలన్ మస్క్ అనేక మార్పులు చేశారు. బ్లూ సబ్ స్క్రిప్షన్ పేరుతో కొన్ని ఫీచర్ల వినియోగంపై పరిమితులు విధించాడు. గతంలో ట్వీట్లు చూడటంపై ఎటువంటి పరిమితి ఉండేది కాదు. అలాగే లాగిన్ అయితే మాత్రమే ఇతర ట్వీట్లు చూసే అవకాశం ఉంది. దీనికి తోడు బ్లూ టిక్ కొనుగోలు చేసిన యూజర్లకు మాత్రమే పదివేల అక్షరాలు రాసుకునే అవకాశం ఉంది. అధికంగా ట్వీట్లు చూసుకునే సౌలభ్యం లభించింది. దీంతో చాలా మంది మెటా తీసుకువచ్చిన థ్రెడ్స్ యాప్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అది అంతగా ఆకట్టుకోలేకపోతుంది. మరీ ఇప్పుడు తీసుకు వచ్చే ఫీచర్ కేవలం బ్లూటిక్ యూజర్లకా.. లేక అందరికీ అందుబాటులోకి తీసుకువస్తారా అని తెలియాల్సి ఉంది.