స్పెషల్ డెస్క్- ఈ కాలం పిల్లలకు తెలివితేటలు ఆపారం, ప్రతిభ పాటవాలు ఆమోఘం అని చెప్పవచ్చు. ఒక్క చదువులోనే కాదు.. అన్ని రంగాల్లో నేటి తరం పిల్లలు దూసుకుపోతున్నారు. తెలంగాణలో ఓ బాలిక చూపిన చొరవ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ బాలిక చేసిన పనితో ఓ గ్రామానికి చెందిన విధ్యార్ధులందరి కష్టాలు తొలగిపోయాయి.
ప్రతి రోజు కిలోమీటర్ల దూరంలోని బడికి ప్రైవేటు వాహనాల్లో వెళ్లివస్తున్న విధ్యార్ధుల ఇబ్బందులు తొలిగిపోయాయి. ఇప్పుడు ఆ గ్రామానికి బడి పనివేళలకు అనుగుణంగా ప్రతి రోజూ ఆర్టీసీ బస్సు వస్తోంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడ్ గ్రామానికి చెందిన వైష్ణవి ఎనిమిదో తరగతి చదువుతోంది. తన సోదరుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆ ఊరికి ఆరు కిలో మీటర్ల దూరంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు. అంతే కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తమ సోదరి ప్రీతి 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళుతోంది.
ఐతే ఆ ఊరికి కేవలం ఒక్క ఆర్టీసీ బస్సు సర్వీసు మాత్రమే ఉంది. అది విధ్యార్ధుల స్కూల్ సమయానికి అనుగునంగా రావడం లేదు. దీంతో వైష్ణవి ఏకంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది. తమ గ్రామం నుంచి పాఠశాలకు వెళ్లిరావడానికి ప్రతి రోజు అటో చార్జీలు 150 అవుతున్నాయని, తమ తండ్రి కరోనా మొదటి దశలో గుండె పోటుతో చనిపోయారని, అమ్మ చిన్న ఉద్యోగం చేస్తూ తమను పోషిస్తోందని సీజేఐ దృష్టికి తీసుకెళ్లింది. బడికి వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో బస్సులు లేవని లేఖలో తెలిపింది.
ఉదయం ఏడింటికి ఆర్టీసీ బస్సు ఉండటంతో కొంత మంది తెల్లవారుజామునే లేచి బడికి వెళుతున్నారని, తిరిగి వచ్చేందుకు సాయంత్రం 6:30కు బస్సు ఉండటంతో స్కూలు వదిలినా కూడా గంటన్నర దాకా వేచి చూడాల్సి వస్తోందని, ఇంటికి వచ్చేసరికి రాత్రి 7 గంటలవుతోందని లేఖలో వివరించింది వైష్ణవి. విద్యాసంస్థల సమయాలకు అనుగుణంగా గతంలో ఉన్న బస్సును పునరుద్ధరిస్తే తమ సమస్యలు తీరతాయని, ఆ మేరకు ఆర్టీసీ బస్సును తిరిగి ప్రారంభించడానికి సహాయం చేయాలని వైష్ణవి సీజే ఎన్వీ రమణకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది.
వైష్ణవి రాసిన లేఖపై జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సుప్రీం కోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్కే రాఖేజా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్కు లేఖ రాశారు. బస్సును పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ కార్యాలయం నుంచి అందిన లేఖకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ ద్వారా స్పందించారు. మమ్మల్ని అప్రమత్తం చేసినందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ధన్యవాదాలు.. పిల్లలకు విద్యా హక్కును గౌరవించి సకాలంలో విద్యార్థులను పాఠశాలలకు చేర్చడానికి బస్సును పురుద్ధరించాం.. అని తెలిపారు.
ఇబ్రహీంపట్నం నుంచి చీదేడ్ మీదుగా దాతుపల్లి వరకు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 5గంటలకు, రాత్రి 9గంటలకు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు సజ్జనార్ చెప్పారు.
#TSRTC Management sincerely Thank the Hon’ble apex court Chief Justice of India #CJIRamana Sir for alerting us to restore buses to send students on school timings in token of honoring #RTE @rashtrapatibhvn @PMOIndia @DrTamilisaiGuv @TelanganaCMO @barandbench @LiveLawIndia pic.twitter.com/eCkIopxZfH
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 3, 2021