ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ చేదువార్త తెలియజేసింది. బస్సు ప్రయాణికులకు కొన్ని విషయాల్లో రాయితీలు కల్పిస్తూనే తెలంగాణ ఆర్టీసీ బ్యాడ్న్యూస్ తెలిపింది.
రాష్ట్ర ప్రజలకు టీఎస్ ఆర్టీసీ సంస్థ ద్వారా నిరంతరం సేవలు అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రయాణించుటకు, అవసరమైన వస్తువులను తరలించేందుకు బస్సు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. నిరంతరం సేవలందించే ఆర్టీసీ సంస్థ అధికారులు.. ప్రజలకు అనుగుణంగా ఎన్నో మార్పులు చేస్తున్నారు. ప్రజలకు సేవలందించేందుకు ఆఫర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రైవేటు వాహనాలు ఎన్ని ఉన్నా ఆర్టీసీ సంస్థ అందించే సేవలు మరువలేనివి. ఇలా ప్రయాణికులకు ఆఫర్లు అందిస్తూనే టీఎస్ ఆర్టీసీ ఓ చేదువార్త కూడా చేరవేసింది. హైదరాబాద్ నగరంలో ప్రయాణించే వారికి టీ-24 టికెట్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధర ఎంత? దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఎంప్లాయ్స్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. గుడ్న్యూస్ చెబుతూ.. ప్రయాణికులకు చేదువార్త తెలిపింది. గ్రేటర్ పరిధిలో బస్సు ప్రయాణికులకు 24 గంటలపాటు ప్రయాణించడానికి వీలు కలిగించే టీ-24 టికెట్ ప్రస్తుత ధర పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. సాధారణంగా ప్యాసెంజర్లకు ఇప్పటివరకు టీ-24 టికెట్ ధర రూ. 100 ఉండేది. ఆ ధరను రూ.120కి పెంచుతూ నిర్ణయించారు.
గతంలో టీ-24 టికెట్ ధర రూ.100 ఉండగా.. ఏప్రిల్ 26న రూ. 90కి తగ్గించారు. దీంతో ప్రయాణికులంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇదే టికెట్ సీనియర్ సిటీజన్స్కి రూ.80కి తగ్గించారు. కొద్ది రోజుల తర్వాత తిరిగి పాత ధరలు అమలు చేస్తూ రూ.100కి పెంచారు. తాజాగా టీ-24 టికెట్ ధరల్ని సవరిస్తూ రూ. 120కి పెంచారు. పెంచిన ధరలు నేటి నుండి అమల్లోకి రానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ టికెట్పై రోజుకు 20 వేల మంది ప్రయాణికులు యూజ్ చేసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. నగరంలో రెండు మూడు ప్రాంతాలకు వెళ్లేవారు ఈ టికెట్ను ఉపయోగించుకుంటున్నారు.