స్పోర్ట్స్ డెస్క్- టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ ఎట్టకేలకు సాధించేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో రోహిత్ వంద బాదేశాడు. మొత్తం 205 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్తో వంద పరుగులు పూర్తి చేశాడు రోహిత్ శర్మ. 94 పరుగుల వద్ద మొయీన్ అలీ బౌలింగులో లాంగాన్ మీదుగా బంతిని స్టాండ్స్లోకి తరలించిన రోహిత్ శర్మ టెస్టుల్లో ఎనిమిదో సెంచరీ చేశాడు. విదేశాల్లో రోహిత్ శర్మకు ఇదే మొట్టమొదటి టెస్టు సెంచరీ కావడం విశేషం.
ఇక ఓవర్ నైట్ స్కోరు 43/0 తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీం ఇండియా 83 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (46) రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి నిదానంగా ఆడిన రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకోకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో మెల్లిగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. ఆ తర్వాత కూడా అదే ఊపు కంటిన్యూ చేశాడు.
అతడికి పుజారా పూర్తి సంహకరించడంతో రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. పుజారా, రోహిత్ లు ఇద్దరూ కలిసి 191 బంతుల్లో 113 పరుగులు జోడించి మంచి స్కోర్ సాధించారు. అటు పుజారా కూడా మెల్లిగా ఆడుతూ అర్ధ సెంచరీకి దగ్గరయ్యాడు. మొదటి సెషన్లో ఇంగ్లండ్ జట్టు బౌలర్లపై పైచేయి సాధించిన పుజారా, రోహిత్ అదే ఊపును రెండో సెషన్లోనూ కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం 66 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది. రోహిత్ 101, పుజారా 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీం ఇండియా ఆధిక్యం ప్రస్తుతం 97 పరుగులకు చేరింది.
First century outside India for the Hitman! 🔥
He gets there with a monster six over long on!Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #RohitSharma pic.twitter.com/4HDSE276Ow
— Sony Sports (@SonySportsIndia) September 4, 2021