చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన కిడ్స్.. ఇప్పుడు నటీనటులుగా రాణిస్తున్నారు. అటువంటి వారిలో ఒకరు బుల్లితెర నటి సుజిత. మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణంలో మూగ,చెవిటి అబ్బాయిగా నటించిన సుజిత.
చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన కిడ్స్.. ఇప్పుడు నటీనటులుగా రాణిస్తున్నారు. అటువంటి వారిలో ఒకరు బుల్లితెర నటి సుజిత. మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణంలో మూగ,చెవిటి అబ్బాయిగా నటించిన సుజిత.. ఆ తర్వాత వెండితెరపై, ఇప్పుడు బుల్లితెరపై నటీమణిగా కొనసాగుతూనే ఉంది. కలవారి కోడలు, తులసీదళం, మౌనరాగం, సుందరకాండ, కల్పన, శ్రీకృష్ణ లీలలు, సౌందర్య, ఆదివారం ఆడవాళ్లకి సెలవు కావాలి, సుడిగుండాలు, కర్తవ్యం, ఏడగుడులు, గంగోత్రి, ఆడవారి మాటలకు అర్ధలే వేరులే, వదినమ్మ, గీతాంజలి వంటి పాపులర్ సీరియల్స్ నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె అన్నయ్య కూడా మనకు బాగా తెలిసిన నటి భర్తే. అతడు కూడా అనేక సినిమాల్లో నటించారు.
ఆయన మరెవ్వరో కాదూ దర్శకుడు సూర్యకిరణ్. సుమంత్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన సత్యం సినిమాకు దర్శకుడు ఆయన. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్. ఆ తర్వాత ధన 51, బ్రహ్మస్త్రం, రాజుభాయ్ వంటి సినిమాలు తీసినా పెద్దగా ఆడలేదు. ఆయన సతీమణే నటి కళ్యాణి. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. అయితే కొన్నేళ్లకే మనస్పర్థల కారణంగా విడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజిత.. వారి విడిపోవడానికి కారణాలను వెల్లడించారు. అన్నయ్య పెళ్లైన రెండు మూడేళ్లకే తనకు పెళ్లి అయిపోయిందని, తానెప్పుడూ షూటింగ్లోనే ఉండేదాన్ని అని, అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేదానని, హైదరాబాద్ షూటింగ్ వెళ్లినప్పుడు కలిసేదాన్నని చెప్పారు.
‘మా వదిన కళ్యాణి సినిమా ఇండస్ట్రీలో ఉండేది. అప్పటికే తెలుగులో పెద్ద యాక్టర్స్ కూడా. తనతో ఉండటం చాలా ఇష్టం. తన డ్రెస్సింగ్ను ఇష్టపడుతుంటా. అక్కాచెల్లెళ్లు ఎలా ఉంటారో. మా మధ్య అలాంటి రిలేషన్ షిప్ ఉంది. వాళిద్దరీ మధ్య ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది. జీవితంలో ఫైనాన్షియల్ సమస్యలు వచ్చినప్పుడు.. దంపతుల్లో ఒక్కరికైనా బ్యాలెన్స్ చేసే సామర్థ్యం ఉండాలి. నాకు తెలిసి పెద్ద పెద్ద విషయాల్లో కాళ్లు పెట్టేశారు. కొంచెం స్లోగా వెళ్లి ఉండాల్సింది. వాళ్లు ఎలా లైఫ్ ను డిజైన్ చేసుకున్నారో.. వాళ్లకే తెలుసు. ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నామంటే..చెయ్యండి అని మాత్రమే చెప్పాను. నాకు, అన్నయ్యకు 8 సంవత్సరాల గ్యాప్ ఉంది. అన్నయ్య అంటే భయం. నేను అడ్వైజ్ చేసే స్టేజ్ కాదు. నాకు చిన్నప్పుడే నాన్న చనిపోతే.. అన్నయ్య అంటే ఫాదర్ ఎఫెక్షన్ ఎక్కువ. అందుకే భయం’అని చెప్పారు.
‘కమర్షియల్ డిజాస్టర్ కారణంగా, ఆ పరిస్థితుల్లో అన్ని అలవాట్లు పడ్డాడు అన్నయ్య. హైదరాబాద్లో ఉండటం వల్ల ఫ్యామిలీ గైడెన్స్ లేకుండా పోయింది. మాకు తెలిసి, ఏదైనా హెల్ప్ చేద్దామనుకునే సరికి అన్ని దాటేశారు. అప్పుల్లో కూరుకుపోయారు. కేరళలో ఉన్న ప్రాపర్టీని అమ్మేశారు. అది అమ్మేసిన విషయం కూడా నాకు తెలియదు. అప్పుడే డబ్బులు అప్పు ఇవ్వకూడదని అమ్మను చూసి, అప్పులు ఎవ్వరి దగ్గర తీసుకోకూడదు అని నా అన్నయ్యను చూసి నేర్చుకున్నాను. ఎవరైనా 10 లక్షలు డబ్బులు అడిగితే.. ఇదిగో నా వల్ల ఇంతే సాయం అవుతుందని చెప్పండని ఈ తరం వారికి చెబుతున్నా. అందరికీ సినిమా అనేది కలిసిరాదు. ఇదొక గ్యాంబ్లింగ్. క్రియేటివ్ జాబులో డబ్బులు పెట్టి.. ఫైనాన్షియల్ ప్రెషర్ పెట్టుకుని డైరెక్ట్ చేయడం అనేది నాకు తెలియదు. మొత్తం డబ్బులు పెట్టడం అనేది సరైనది కాదు అనేది నా అభిప్రాయం. అదే వారి లైఫ్ ను ముంచేసింది’అని సుజిత పేర్కొంది.