న్యూ ఢిల్లీ- ఆంధ్రప్రదేశ్ నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి వైపీసీ ఎంపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవిత్రమైన పార్లమెంటులో సభ్యసమాజం తలదించుకునేలా తనపై వైసీపీ ఎంపీలు బూతు మాటలతో రెచ్చిపోయారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. లోక్ సభలో తనను కొందరు వైసీపీ ఎంపీలు లం** కొ** అంటూ పచ్చి బూతులు తిట్టారని రఘురామ కృష్ణరాజు ఆవేధన వ్యక్తం చేశారు. ఈ బూతు మాటలకు అర్థం ఏంటని పార్లమెంటులో ఉన్న ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా అడిగారని తెలిపారు.
రఘురామ కృష్ణరాజు ఏమన్నారంటే.. ఎవరో కొందరు మొన్న అర్థం లేని మాటలు మాట్లాడినప్పుటికీ లం** కొ** కొడక అని అర్థం చేసుకుని.. బీపీలు పెంచుకున్నారు. కానీ, ఇవాళ పార్లమెంటులో కొందరు నన్ను లం** కొ**.. నువ్వు మాట్లాడకురా లం** కొ**.. అని కనీసం నలుగురు, ఐదుగురు మాట్లాడారు. ఇదేనా సంస్కారం.. కనీసం బోసిడికే అని కూడా అనలేదు.. లం** కొ** అంటార్రా.. పార్లమెంటులో.. రాస్కెల్స్.. అని ఫైర్ అయ్యారు.
అంతే కాదు.. సంస్కారం లేదు.. మీకు.. ఏం చేస్తాం, మీకున్న సంస్కారం అది, మీకున్న జ్ఞానం అది.. మీకు తెలుగు రాదు, ఇంగ్లిష్ రాదు.. మీకు ఏ భాష రాదు.. మీకు వచ్చిందల్లా బూతు భాష.. ఆ బూతు భాషను పార్లమెంటులో కూడా వాడేస్తారు. మిగిలిన వాళ్లంతా సిగ్గుతో తలదించుకున్నారు. పార్లమెంటు నుంచి బయటకు వస్తుంటే కొందరు ఎంపీలు.. ‘ఓ లం** కొ** క్యా హై.. అర్థం ఏంటి.. అని అడిగారు.
వాళ్లకు ఏం చెప్పాలి.. అంత కుసంస్కారంగా ఎవరుపడితే వారు ఇక్కడి వచ్చి.. ఇలా మాట్లాడుతున్నారు.. ఛీ, రాస్కెల్స్ అని అనాలని ఉంది కానీ.. ప్రజలు అంటారు.. నేను అనక్కర్లేదు.. అంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర స్థాయిలో వైసీపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీ సంస్కారం అంటూ మండిపడ్డారు. బూతుమాటలతో పవిత్రమైన పార్లమెంట్ ను వైసీపీ ఎంపీలు అపవిత్రం చేశారని వ్యాఖ్యానించారు.