న్యూ ఢిల్లీ- దేశంలో ప్రతిభ ఎక్కడ ఉన్నా దాన్ని గుర్తించడంలో ముందుంటారు మన ప్రధాని నరేంద్ర మోదీ. ఏ రంగంలోనైనా ప్రతిభ కనబరిచిని వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంటారు ప్రధాని. మన తెలుగు యువకుడు కూడా మోదీ చేత ప్రశంసించబడ్డాడు. తిరుపతికి చెందిన యువకుడిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
తిరుపతికి చెందిన సాయిప్రణీత్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. సాయి ప్రణీత్ 7 సంవత్సరాలుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఐఎండీ ఐక్యరాజ్యసమితి హ్యాబిటేట్ ప్రశంసలను కూడా అందుకున్నారు. సాయి ప్రణీత్ గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో అతన్ని కొనియాడారు.
ఏపీ వెదర్ మ్యాన్ పేరుతో వాతావరణ సమాచారాన్ని అందిస్తున్న సాయి ప్రణీత్, సామాజిక మాధ్యమాల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను మోదీ అభినందించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ సాయి ప్రణీత్ ను అభినందించడం పట్ల అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రధానికి వారంతా కృతజ్ఞతలు చెప్పారు.
ప్రతినెలా జరిగే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమం 79వ ఎపిసోడ్లో భాగంగా మోదీ పలు కీలక విషయాలపై మాట్లాడారు. ప్రధాని మోదీ ఇచ్చిన స్పూర్తితో ముందు ముందు వాతావరణంపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తానని సాయి ప్రణీత్ చెప్పాడు. మరి సాయి ప్రణీత్ కు మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదామా..
తమ అభిరుచిని అనుసరిస్తూ, దాని ద్వారా ఇతరులకు, ముఖ్యంగా రైతులకు సహాయం చేస్తున్న @APWeatherman96 వంటి యువకులను చూస్తుంటే నాకు గర్వంగా అనిపిస్తుంది. #MannKiBaathttps://t.co/D7rGhtpEXC pic.twitter.com/gPPL7yErfq
— Narendra Modi (@narendramodi) July 25, 2021