మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులా? ఇటీవల కాలంలో బ్యాంకుల్లో ఏదైనా లోన్ తీసుకుంటున్న సమయంలో లేదా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నప్పుడు కానీ ఇన్య్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలంటూ బ్యాంకు అధికారులు బలవంత పెడితే.. ఇబ్బందులకు గురైన సందర్భాలున్నాయా?
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులా? ఇటీవల కాలంలో బ్యాంకుల్లో ఏదైనా లోన్ తీసుకుంటున్న సమయంలో లేదా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నప్పుడు కానీ ఇన్య్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలంటూ బ్యాంకు అధికారులు బలవంత పెడితే.. ఇబ్బందులకు గురైన సందర్భాలున్నాయా? అవసరం లేకపోయినా చేసేదేమీ లేక కొనుగోలు చేశారా..? అటువంటి బాధితుల్లో మీరు కూడా ఒకరా..? అలాగే మనకు తెలియకుండానే ఓ పథకం కింద కొంత డబ్బు కట్ అవుతూ ఉంటుందా? అయితే ఇక అటువంటి వాటికి చెక్ పెట్టేందుకు సిద్దమైంది దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ. ఇలా ఇన్య్సూరెన్స్ ప్రొడక్టులు తీసుకోవాలంటే వినియోగదారులపై ఒత్తిడి తీసుకురావడంపై సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు అందండతో ఓ స్టెప్ తీసుకుంది.
ఓ వినియోగదారుడు ఇటువంటి అనుభవమే ఎదురైతే.. సోషల్ మీడియా ద్వారా ఆవేదనను వ్యక్తపరుస్తూనే.. విజ్ఞప్తి కూడా చేశారు. ‘కటక్లోని ఛండీ చాక్ బ్రాంచులో సేవింగ్స్ ఖాతా తీసుకున్నానని, అయితే ఖాతా తెరవడం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అయితే ఇన్య్సూరెన్స్ ప్రొడక్టులు తీసుకోవాలని కస్టమర్లను బలవంత పెడుతున్నారు. పాలసీ తీసుకోవాలంటే ఖాతా దారుల ఇష్టప్రకారం జరగాలి కానీ సిబ్బంది ఒత్తిడి చేయడం సరికాదు’ అంటూ ఓ వినియోగదారుడు ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన ఎస్బీఐ ఇన్య్సూరెన్స్ పాలసీతో సహా ఇతర పెట్టుబడి స్కీమ్స్ తీసుకోవడం పూర్తిగా వినియోగదారుల ఇష్టం అని పేర్కొంది. వారికి ఇష్టం ఉంటే సమాచారం అడిగి తెలుసుకోవాలని, అవగాహన కోసం మాత్రమే ఎస్బీఐ బ్రాంచులు సమాచారం ఇవ్వాలని పేర్కొంది.
అలాగే ఇటీవల కాలంలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన్ (పీఎంజేజేబీవై (PMJJBY))పథకం కింద బ్యాంకు నుండి రూ. 435 రూపాయలు కట్ అవుతున్నట్లు పలువురు కస్టమర్ల నుండి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. తాము ఎటువంటి పథకానికి దరఖాస్తు చేయకుండానే డబ్బులు క్రెడిట్ అవ్వడంపై పలువురు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వీటిపై స్పందించిన ఎస్బీఐ.. ఇన్య్సూరెన్స్ , ఇతర పెట్టుబడి పథకాలు వారి ఇష్టంపై ఆధాపడి ఉంటాయని తెలిపింది. కస్టమర్ కావాలనుకుంటేనే పాలసీలను ఇవ్వాలని, కస్టమర్లకు సేవలందించే సమయంలో అన్ని విలువలను పాటిస్తామని తెలిపింది.
కస్టమర్ అనుమతి లేకుండా అకౌంట్కు చెందిన ఆర్థిక లాావాదేవీలు ఎట్టిపరిస్థితుల్లో జరగవని తెలిసింది. సర్వీసులు తీసుకోవాలంటే పాలసీ తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. ఇబ్బందులు పడినట్లు ఫిర్యాదు చేసిన కస్టమర్ వివరాలు, కాంటాక్ట్ నంబర్ తమకు ఇవ్వాలని సమస్యను పరిష్కారిస్తామని తెలిపింది. ఇటువంటి సందర్భాలు ఎదుర్కొన్న ఎస్బీఐ ఖాతాదారులు https://crcf.sbi.co.in/ccf ద్వారా ఫిర్యాదు చేయొచ్చుని తెలిపింది. అలాగే General Banking>Operation of Accounts>Disputed Debit/Credit Transaction లోకి వెళ్లి మీకు ఎదురైన సంఘటన గురించి వెల్లడిస్తే.. సిబ్బంది సమస్య పరిష్కరిస్తారని తెలిపింది.