దక్షిణాఫ్రికాలో వెలుగు చేసిన ఒమిక్రాన్ పెను వేగంతో ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. భారత్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల శర వేగంగా పెరుగుతోంది. ఒక్క రోజులోనే రికార్డ్ స్థాయిలో క్తొత వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.
అటు ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఒమిక్రాన్ దేబ్బకు ప్రపంచవ్యాప్తంగా 3500కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్ లైన్స్ సిబ్బంది కూడా ఒమిక్రాన్ సోకడంతో సర్వీసులు రద్యయ్యాయి. ఒక్క అమెరికాలోనే 500లకు పైగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు క్రిస్మస్ వేడుకలకు హాజరు కాలేకపోయారు. చివరి నిమిషయంలో విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : ఒమిక్రాన్ ఎఫెక్ట్: లాక్ డౌన్.. రాష్ట్రపతి పాలన విధించొచ్చు
ఇండియాలో పరిస్థితి ఇలా…
భారత్లో కూడా ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు సంఖ్య 400 కు చేరింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది.ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. ఫలితంగా క్రిస్మస్, న్యూ ఈయర్ వేడుకలపై భారీ ప్రభావం పడనుంది.
ఆంక్షలు విధించని రాష్ట్రాలు….
1. ఢిల్లీలో న్యూ ఈయర్ వేడుకలను రద్దు చేశారు.
2. క్రిస్మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో ఒడిశాలో డిసెంబర్ 25నుంచి జనవరి 2, 2022 వరకు ఆంక్షలు.
3. ఉత్తర ప్రదేశ్లో డిసెంబర్ 25 నుంచి నైట్ కర్ఫ్యూ. నోయిడా, లక్నోలో 4. ఈ నెల 31 వరకు 144 సెక్షన్ అమలు
5. ముంబైలో ఈ నెల 31 వరకు 144 సెక్షన్
6. హరియాణాలో జనవరి 1 నుంచి నైట్ కర్ఫ్యూ
7. మధ్యప్రదేశ్ లో ఈ నెల 31 వరకు నైట్ కర్ఫ్యూ
8. కర్ణాటకలో న్యూ ఇయర్ వేడుకల నిర్వహణపై ఆంక్షలు
9. తమళినాడులో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం.
ఇది కూడా చదవండి : ఒమిక్రాన్ టెన్షన్.. తెలంగాణలో ఆంక్షలు విధించండి