ప్రేమిస్తున్నాను అని కూతురు చెబితే.. అతడు ఎలాంటి వ్యక్తి అని చూడకుండా.. కులం, మతం, గోత్రాలు అంటూ ఎంక్వైరీ చేస్తారు. ఇక తమ కులానికి చెందిన వాడు కాదని తెలిస్తే..పెళ్లికి ససేమీరా అంటారు. కూతురు చెప్పినా వినిపించుకోకపోగా.. కట్టడి చేయడం మొదలు పెడతారు. కుమార్తె మనస్సు తెలుసుకోకుండా మరొకరితో పెళ్లి చేసేందుకు సిద్ధమౌతుంటారు.
ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి.. పెళ్లి చేస్తారు కానీ.. పిల్లలు ఇష్టపడిన వ్యక్తులకిచ్చి పెళ్లిచేసేందుకు నిరాకరిస్తుంటారు పెద్దలు. ముఖ్యంగా అడ్డంకులు వచ్చేది అమ్మాయి ఇంటి నుండే. ప్రేమిస్తున్నాను అని కూతురు చెబితే.. అతడు ఎలాంటి వ్యక్తి అని చూడకుండా.. కులం, మతం, గోత్రాలు అంటూ ఎంక్వైరీ చేస్తారు. ఇక తమ కులానికి చెందిన వాడు కాదని తెలిస్తే..పెళ్లికి ససేమీరా అంటారు. కూతురు చెప్పినా వినిపించుకోకపోగా.. కట్టడి చేయడం మొదలు పెడతారు. కుమార్తె మనస్సు తెలుసుకోకుండా మరొకరితో పెళ్లి చేసేందుకు సిద్ధమౌతుంటారు. నీ తల్లిదండ్రులుగా నీకొక మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నామంటూ కూతురికి బోధిస్తారు. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక.. పెద్దలను ఎదిరించలేక.. అమ్మాయి మానసిక వేదన అనుభవిస్తుంది. ఇక ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో.. చెప్పడం ఊహాతీతం.
ప్రేమించిన వ్యక్తిని మనువాడినందుకు తల్లిదండ్రులు.. కుమార్తెకు ఘోరమైన శిక్ష వేశారు. బతికుండగానే కర్మకాండలు చేసి, పిండ ప్రదానం నిర్వహించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్ పూర్లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమ్ ఖేరా ప్రాంతానికి చెందిన అనామిక దూబే.. ముస్లిం వ్యక్తిని ప్రేమించి.. ఈ నెల 7న వివాహం చేసుకుంది. తన పేరును ఉజ్మా ఫాతిమాగా మార్చుకుని.. ముస్లిం సంప్రదాయం ప్రకారం..కోర్టును సంప్రదించి వివాహం చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు.. ఈ పని చేసే సరికి.. తట్టుకోలేని తల్లిదండ్రులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇక తమకు కూతురు లేదంటూ .. బతికి ఉండగానే ఆమెకు నర్మదా నది తీరాన అంతిమ సంస్కారాలు చేశారు.
తమ కుమార్తె చనిపోయిందని, ఆమె పిండ ప్రదానానికి హాజరు కావాలంటూ కార్డులు కూడా ప్రింట్ చేయించి.. ఊరంతా పంచడంతో పాటు బంధువులకు పంపారు. తమ ఇష్టం లేకుండా కూతురు ఇతర మతస్థుడిని పెళ్లి చేసుకుని, తమ పరువు తీసిందని భావించిన తల్లిదండ్రులు.. ఆదివారం నర్మదా నది వద్ద గౌరీ ఘాట్లో బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య పిండ ప్రదానం చేశారు. తన సోదరి పెళ్లి కోసం తాము ఎన్నో కలలు కన్నామని, ఆమె మొండి వైఖరి.. ఆ కలలను కల్లలు చేసిందని అనామిక దూబే సోదరుడు అభిషేక్ దూబే అన్నారు. బతికుండగానే తన సోదరికి పిండ ప్రదానం చేయాల్సి వస్తుందని ఊహించలేదని అన్నారు. సాంకేతికంగా దేశం ముందుకు సాగుతున్న.. ఇంకా కులాలు, మతాల పేరిట పిల్లల పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రులు ఇలా వ్యవహరించడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.