రక్షాబంధన్.. అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్లు మధ్య ఉన్న బాంధవ్యం కలకాలం నివాలని జరుపుకునే వేడుక. అక్కచెల్లెలకు రక్షణగా జీవితాంతం తోడు ఉంటామని సోదరులు భరోసా ఇచ్చే పండుగ. ఈ పర్వదినాన అక్కలు, చెల్లెళ్ళు వారి సోదరులకు రాఖీ కట్టి..తమకు రక్షణగా ఉండాలని చెప్తుంటారు. ఈ సందర్బంగా సోదరులు ఎక్కడ ఉన్న వారి వద్దకు వెళ్లి సోదరిమణులు రాఖీ కడుతుంటారు. అయితే రక్షాబంధన్ సందర్భంగా ఓ సోదరి ఉదంతం నెటిజన్లను కంటతడి పెట్టించింది. భూమీ మీద లేని తన సోదరుడికి రాఖీ కట్టింది. అమరవీరుడైన తన సోదరుడి విగ్రహానికి పండుగ సందర్భంగా ఆ సోదరి రాఖీ కట్టింది. వారికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ జిల్లా ఖుడియాలా గ్రామానికి చెందిన గణపత్ రాం కద్వాస్ వ్యక్తి ఆర్మీలో పనిచేస్తుండే వారు. జమ్మూకశ్మీరులో ఆర్మీ విధులు నిర్వహిస్తుండే వారు. 2017 సెప్టెంబరు24న ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం చెందారు. గణపత్ రాం కద్వాస్ వీరమరణానికి గుర్తుగా అతని విగ్రహాన్ని ఖుడియాలా గ్రామంలో ఏర్పాటు చేశారు. వీర సైనికుడి సోదరి రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఆయన విగ్రహానికి రాఖీ.. కట్టి అతని ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సోదరి సైనికుడి విగ్రహానికి రాఖీ కట్టిన ఫోటోను వేదాంత బిర్లా అనే వ్యక్తి లింకెడిన్ లో పోస్టు చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఈ ఫోటో నెటిజన్లను కంటతడి పెట్టించింది. దేశం కోసం త్యాగం చేసిన సోదరుడిని కోల్పోయినందుకు దుఃఖంతో ఉన్న సోదరి.. రక్షా బంధన్ రోజున భావోద్వేగంతో తన సోదరుడి విగ్రహానికి రాఖీ కట్టింది. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టుకు వేలాది స్పందనలు, కామెంట్లు వచ్చాయి. ఈ పోస్టు నెటిజన్ల హృదయాలను టచ్ చేసింది. మరి.. ఈ ఎమోషనల్ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Share https://t.co/yKQeYebSIV
— Sekhar Rambo (@RamboSekhar) August 12, 2022