సమాజంలో జరిగే వివాదాల్లో ఎక్కువ ఆస్తులకు, డబ్బులకు సంబంధించినవే ఉంటాయి. కోర్టులో ఉండే కేసుల్లో ఎక్కువ శాతం సివిల్ కేసులే ఉంటున్నాయి. కోర్టుకి వచ్చే ఈ సివిల్ కేసుల్లో విచిత్రమైన ఫిర్యాదులు ఉంటాయి. మమ్మల్ని బెదిరించి రాయించుకున్నారని కొందరు, మాకు మత్తు మందు ఇచ్చి మా ఆస్తి కాజేశారని మరికొందరు.. ఇలా అనేక రకాలా ఫిర్యాదులతో చాలామంది కోర్టు మెట్లు ఎక్కుతారు. తాజాగా ఇలాంటి ఓ కేసు విషయంలో ఓ మహిళ న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్తకు శస్త్ర చికిత్స జరిగి జ్ఞాపక శక్తి కోల్పోగా.. రూ.2 కోట్ల విలువైన ఆస్తిని ఓ మహిళకు విక్రయించారని భార్య కోర్టును ఆశ్రయించింది. దీంతో భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ లోని బంజారాహిల్స్ సౌభాగ్య కాలనీలో నివసించే ఐనాల వెంకట రాంప్రసాద్ కంప్యూటర్ ఇంజినీరుగా పని చేసేవారు. ఆయనకు భార్య వాసవి, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం రాంప్రసాద్ తీవ్రమైన తలనొప్పితో నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. రాంప్రసాద్ ను వైద్యలు పరిక్షించి.. ట్రానిటనీ వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియాగా గుర్తించి శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తరువాత రాంప్రసాద్ జ్ఞాపక శక్తి ని కోల్పోయారు. అప్పటికే ఆయన తల్లిదండ్రులు చనిపోయారు. ప్రసాద్ జాబ్ కూడా కోల్పోయారు. ఈ క్రమంలో 2017లో ఇంటి నుంచి రాంప్రసాద్ అదృశ్యమయ్యారు. భార్య పోలీసులను ఆశ్రయించగా.. వారు వెదికి పట్టుకొని అప్పగించారు. ఇక అప్పటి నుంచి రాంప్రసాద్ ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, ఇటీవల మదీనాగూడలోని ఓ ప్రాంతంలో ఉన్న తమ ఇంటిని తన భర్త పద్మ అనే మహిళకు విక్రయించినట్లు భార్య వాసవి గుర్తించింది. ఆ ఇంటి విలువ దాదాపు రెండు కోట్లు ఉంటుంది. ఆ ఇంటి అమ్మకానికి సంబంధించిన డబ్బులు కూడా భర్త ఖాతాలో జమకాలేదని, దస్తావేజుల్లో రూ.50 లక్షలకు విక్రయించినట్లు తెలుసుకున్నారు. న్యాయం చేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు.కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు వాసవి భర్త రాంప్రసాద్ పై మెంటల్ హెల్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: లక్షన్నరకే ఓయూ ఇంజనీరింగ్ సర్టిఫికేట్.. వెలుగులోకి ఖంగుతినే నిజాలు! ఇదీ చదవండి: రూ.15 కోట్ల ఆస్తి కోసం భర్త, కుమారుడి దారుణం.. బతికుండగానే!