గతంలో విద్యార్థులు టీచర్ కనపడగానే ఆమడదూరం పరిగెత్తేవారు. ఏమంటాడో అన్న భయం ఒకటైతే.. రేపు స్కూల్ కు వెళ్తే ఎన్ని దెబ్బలు వేస్తాడో అన్న టెన్షన్ మరోవైపు. కానీ, ఇప్పటి పిల్లలు అలా కాదు. టీచర్ తిట్టినా ఇంట్లో చెప్పడమే.. కొట్టినా ఇంట్లో చెప్పడమే. ఇది చెప్పగానే తల్లిదండ్రులు..'ఆ ఎవర్రా..? నిన్ను కొట్టింది పదా ఆ టీచర్ ఎవరో చూపిద్దువు గానీ వాడి హంతు తేలుద్దాం..' అంటూ బయలుదేరుతున్నారు.
నేటి విద్యార్థులే రేపటి పౌరులని, క్రమశిక్షణతో మెలిగి ఉన్నతంగా రాణించాలని ప్రతి పాఠశాలలోనూ ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తూనే ఉంటారు. మీరు కూడా ఈ మాటలు వినే ఉంటారు. గతంలో అంటే.. ఈ మాటలు పర్వాలేదు కానీ, ఈ కాలంలో వీటిని వినే వారే లేరు. ‘అరే సార్.. వస్తున్నాడురా అంటే పూర్వ విద్యార్థులు అతనికి కనపడకుండా అక్కడి నుంచి మాయమయ్యేవారు. అదే నేటి తరం పిల్లలు.. ‘రానివ్వరా, అటునుంచి వెళ్తాడు లే జాగా ఉందిగా..’ అని స్థాయికి ఎదిగారు. పిల్లలను తిట్టకూడదు.. కొట్టకూడదు.. అతిక్రమించారా! కేసు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ విధానమే అమలవుతోంది. తాజాగా ఓ స్కూల్ సిబ్బంది అలాంటి పనే చేసి ఊచలు లెక్కపెడుతున్నారు.
ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్ పరిధిలోని సెయింట్ మీరా స్కూల్లోని కొంతమంది పిల్లలు మిలిటరీ తరహా హెయిర్కట్ తో స్కూల్ కు హాజరవుతున్నారు. ఇది నచ్చని స్కూల్ సిబ్బంది ఒకరు ఆయా విద్యార్థులను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ వారు ప్రవర్తన మార్చుకోకుండా అదే హెయిర్కట్ తో స్కూల్ కు వస్తున్నారు. దీంతో విసిగిపోయిన సిబ్బంది అలాంటి విద్యార్థులందరినీ వరుసలో నిలబెట్టి, అందులో ఒక విద్యార్థిని ఎంచుకొని ట్రిమ్మర్ సాయంతో గుండు కొట్టించాడు. విద్యార్థి సాయంత్రం స్కూల్ ముగిశాక అదే గుండుతో ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులు చూస్తారనే భయంతో ఆ గుండును దాచే ప్రయత్నం చేసినప్పటికీ వారు పసిగట్టేశారు.
ఏం జరిగిందని గట్టిగా ప్రశ్నించడంతో విద్యార్ధి పాఠశాలలో జరిగిన విషయం వారితో చెప్పాడు. కొడుకు చెప్పిన విషయం విన్న తండ్రి వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి సదరు టీచర్ మీద ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్కూల్ విద్యార్థిని 11వ తరగతి చదువుతోన్న శివాన్ష్ గా గుర్తించారు. విద్యార్థికి గుండు కొట్టించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ టీచర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
सेंट मीरा स्कूल के कुछ बच्चे और उनके अभिभावक आए थे। उनकी शिकायत है कि अभिभावकों की सहमति के बिना बच्चों के बाल स्कूल के द्वारा कटा दिए गए हैं। मामले में स्कूल का पक्ष जानकर आगे की कार्रवाई की जाएगी: अरुण दुबे, ज़िला विद्यालय निरीक्षक, मुरादाबाद pic.twitter.com/s0atvkZJmQ
— ANI_HindiNews (@AHindinews) January 28, 2023