ఇటీవల రాజకీయ నేతలు పలు అభివృద్ది కార్యక్రమాలకు హాజరైన సందర్భంలో అస్వస్థతకు గురికావడం చూస్తున్నాం. వరుస కార్యక్రమాలకు హాజరు కావడంతో స్వల్ప అనారోగ్యానికి గురి కావడం.. సభా ప్రాంగణం వద్దనే పడిపోవడం లాంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అస్వస్థతకు గురయ్యారు. గురువారం పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్నపుడు సిలుగూరి వద్ద స్టేజ్ పైనే స్టేజ్ పైనే అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆయనను హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. వివరాల్లోకి వెళితే..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ మద్య ఏపీలో కూడా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం ఆయన పశ్చిమ బెంగాల్ లో రూ.1,026 కోట్ల విలువైన మూడు జాతీయ రహదారుల శంకుస్థాపన కోసం వెళ్లారు. ఈ క్రమంలో దగాపూర్ మైదానం వద్ద ఏర్పాటు చేసి వేదికపై ఉండగానే అకస్మాత్తుగా ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అధికారులు ఆ కార్యక్రమాన్ని ఆపివేశారు.
సభా వేదిక నుంచి గడ్కరిని పక్కనే ఉన్న గ్రీన్ రూమ్ కి తీసుకు సెలెన్ ఎక్కించి వైద్యులు చికిత్స అందించారు. గడ్కరికి షుగర్ లెవెల్స్ తగ్గడం వల్లనే ఆయన సొమ్మసిల్లిపడిపోయారని వైద్యులు తెలిపారు. డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా.. నితిన్ గడ్కరిని తన నివాసానికి తీసుకు వెళ్లారు. ఆయన నివాసంలో సీనియర్ వైద్యులతో గడ్కరికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిస్తా అన్నారు.