కేంద్ర మంత్రి అంటే హంగూ.. ఆర్భాటం ఎంతో గొప్పగా ఉంటుంది. కాన్వాయ్, చుట్టూ సెక్యూరిటీతో మంత్రి వస్తున్నాడంటే నానా హంగామా ఉంటుంది. అలాంటిది ఓ కేంద్ర మంత్రి అతి సామాన్యుడిగా సైకిల్ పై పార్లమెంట్ కి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. రెండ్రోజులుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సభకు వచ్చిన మన్సుఖ్ మాండవీయ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తన ప్రొటోకాల్ను సైతం పక్కన పెట్టి.. సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్కు చేరుకున్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ.
ఇది చదవండి: పోలీసులకు యాంకర్ ప్రదీప్ హీరోయిన్ కంప్లైంట్! కారణం..?
మాండవీయకు అలా రావడం కొత్త కాదు.. ఆయన ఎప్పుడూ సామాన్యుడిలానే ఉంటారు. అప్పుడప్పుడు పార్లమెంట్కు సైతం సైకిల్పై వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. 2019 నవంబర్ 19న కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఇలానే సైకిల్ తొక్కుకుంటూ సభకు వెళ్లారు. ఆ సమయంలో ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉండడంతో ఆయన ఇలా చేశారు. తన వంతుగా పొల్యూషన్ తగ్గించేందుకు కార్లను పక్కన పెట్టి సైకిల్పై పార్లమెంట్కు వెళ్లారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Union Health Minister Mansukh Mandaviya rides a bicycle to Parliament in New Delhi pic.twitter.com/OCW3K896WC
— ANI (@ANI) February 2, 2022