గతంలో కరోనా ప్రభావం యావత్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. దీని కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే చైనాలో కరోనా మళ్లీ పెరుగుతుండడంతో దేశ ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. కరోనా ప్రభావంతో దేశ ప్రజలు ఎన్నో రకాలుగా నష్టపోయారు. ఇక మళ్లీ కరోనా పెరుగుతుండడంతో ప్రజలకు వెన్నులో వణుకు పుడుతుంది. అయితే ఈ క్రమంలోనే మహమ్మారి పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ మాండవియా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
కరోనా చర్యలతో పాటు చైనా, జపాన్, అమెరికా వంటి దేశాల్లో పరిస్థితులను అంచనా వేశారు. ఈ సమావేశం అనంతరం స్పందించిన మంత్రి మన్ సుఖ మాండవియా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కరోనా ఇంకా ముగిసిపోలేదని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక నుంచి ప్రతీ వారం ఈ ఉన్నత స్థాయి కమిటీ తప్పకుండా సమావేశం కావాలని ఆయన తెలిపారు. కేసులు పెరిగితే చర్యలు తీసుకునేందుకు అధికారులు అంతా సిద్దంగా ఉన్నామని, ఎవరూ భయందోళనలకు గురి కాకూడదని తెలిపారు. మరీ ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ మాండవియా ట్విట్టర్ తెలిపారు.
In view of the rising cases of #Covid19 in some countries, reviewed the situation with experts and officials today.
COVID is not over yet. I have directed all concerned to be alert and strengthen surveillance.
We are prepared to manage any situation. pic.twitter.com/DNEj2PmE2W
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 21, 2022