కేంద్ర వార్షిక బడ్జెట్ 2022-23కు ఆమోదం తెలిపేందుకు మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం పార్లమెంట్లో సమావేశమయ్యింది. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ను ప్రవేశపెడతారు. అంతకుముందు 2021-22లో మొదటిసారి పేపర్లెస్ యూనియన్ బడ్జెట్ను సమర్పించారు. ఆర్థిక మంత్రి నిర్మల నాల్గోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉత్కంఠగా కొనసాగబోతున్నట్లు తెలుస్తుంది.
కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈసారి పేపర్లెస్గా కేంద్ర బడ్జెట్ ఉండనుంది. బడ్జెట్ ప్రసంగాన్ని మొత్తం నిర్మలమ్మ ట్యాబ్ చూసి చదవనున్నారు. అలాగే బడ్జెట్ అంశాలకు సంబంధించి మొత్తం వివరాలను ఎంపీలకు డిజిటల్ రూపంలో అందుబాటలో ఉండనుంది. రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 11 వరకూ బడ్జెట్ తొలి విడత సమావేశాలు జరుగనున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకూ జరగనున్నాయి.
యూనియన్ బడ్జెట్ 2022 లైవ్ అప్ డేట్స్ :
12.48 pm : లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు సమర్పించారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం సాగింది. అనంతరం.. లోక్సభను మంగళవారానికి స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.
12.40 pm : ఆర్థిక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు వ్యక్తిగత ఐటీ రిటర్న్లు దాఖలు చేసుకోవచ్చు. సహకార సంస్థలకు కంపెనీలతో సమానంగా ఆల్టర్నేట్ పన్నుప్రత్యామ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు ఉంటుంది.
12.35 pm : ప్రైవేట్ రంగం ద్వారా 5G మొబైల్ సేవలను ప్రారంభించడానికి 2022లో స్పెక్ట్రమ్ను వేలం వేయనున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
12.28 pm : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల విషయంలో తీసుకున్న విధానాల వల్ల జనవరి నెలలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1,40, 986 లక్షల కోట్లుగా తేలాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అత్యధిక ఆదాయం. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందనేందుకు ఇదే ఉదాహరణ.
12.25 pm : రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ డిడక్షన్ కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 10 నుంచి 14 శాతానికి పెంపు ఉంటుందన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి. ఏదైనా వర్చువల్ డిజిటల్ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలని ప్రతిపాదిస్తున్నాం. ఆ ఆదాయాన్ని లెక్కల్లోకి తీసుకున్నప్పుడు ఎటువంటి మినహాయింపు అనుమతించబడదు. మరోవైపు, కార్పొరేట్ సర్ఛార్జ్ 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నాం.
12.22 pm : 2022లో 1.5 లక్షల పోస్టాఫీసుల్లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ 100 శాతం ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించనుంది. ప్రభుత్వం కనీస ప్రభుత్వం మరియు గరిష్ట పాలనకు కట్టుబడి ఉంది. సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వైబ్రంట్ విలేజెస్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
12.18 pm : రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. కరోనా కారణంగా ఆదాయం పడిపోయి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు వడ్డీ లేని అప్పులు ఇస్తామని తీపి కబురు చెప్పింది కేంద్రం. లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇవ్వబోతున్నట్టు పేర్కొంది.
12.16 pm : ఆదాయపు పన్ను శ్లాబ్లో ఉపశమనం లేదు.. సాధారణ బడ్జెట్లో ఆదాయపు పన్ను శ్లాబ్లో ఎలాంటి సడలింపు ఇవ్వలేదు. వర్చువల్ కరెన్సీ ద్వారా వచ్చే ఆదాయాలపై 30% పన్ను విధించబడుతుంది. ఆదాయపు పన్ను శ్లాబ్లో ఎలాంటి మార్పు చేయలేదని ఆర్థిక మంత్రి తెలిపారు.
12.14 pm : నీలాంచల్ నిస్పాత్ నిగమ్ లిమిటెడ్ను ప్రైవేటు పరం చేశామన్నారు. త్వరలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ రాబోతుందన్నారు. ర్మలా సీతారామన్ ప్రసంగంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలు 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనిపించిందన్నారు. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు.
12.12 pm : రక్షణ రంగంలో స్వావలంబన భారత్ పథకానికి ప్రోత్సాహం. మొత్తం రక్షణ సేకరణ బడ్జెట్లో, 68% దేశీయ మార్కెట్ నుండి కొనుగోలు చేయడానికి ఖర్చు చేయబడుతుంది. దీని వల్ల దేశీయ రక్షణ సంస్థలు ప్రయోజనం పొందుతాయి. దిగుమతి బిల్లులో భారీ తగ్గింపు ఉంటుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 58 శాతం ఎక్కువ. దేశీయ మార్కెట్లో ఉపాధి పెరుగుతుంది.
12.08 pm : ఈ ఏడాది నుంచే డిజిటల్ కరెన్సీ : బ్లాక్చెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ రూపాయిని జారీ చేస్తాం. 2022-23 నుంచే ఆర్బీఐ ఈ డిజిటల్ కరెన్సీని జారీ చేస్తుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మరింతగా ఊపునిస్తుందని ఆశిస్తున్నాం
12.03 pm : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నాల్గవ బడ్జెట్ ప్రసంగంలో, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 1486 పనికిరాని చట్టాలను రద్దు చేస్తామని చెప్పారు.
11.58 am : ఇటీవలి కాలంలో డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ పెరిగిపోయిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తూ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించనున్నాం. సామాన్య ప్రజలు దీని నుండి ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు. పౌరుల సౌకర్యాన్ని పెంచేందుకు 2022-23లో ఈ-పాస్పోర్ట్ను జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
11.55 am :ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల కొత్త ఇళ్ల ఏర్పాటు.. 2022-23లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల కొత్త ఇళ్లను నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వాటి కోసం రూ.48 వేల కోట్ల నిధిని ఉంచారు.
11.52 am : నేషనల్ డిజిటల్వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్డ్రోన్లు ఏర్పాటకు కృషి. చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్వర్క్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్డ్రోన్లను అభివృద్ధి చేశామని తెలిపారు.దేశ వ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు నిర్మల తెలిపారు.
11.48am :నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు కృషి.. నేచురల్, జీరో-బడ్జెట్ & సేంద్రీయ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం అవసరాలను తీర్చడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్లు సవరించాలి. దీని కోసం రాష్ట్రాలకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం. మహిళల, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 వంటి పథకాలను మా ప్రభుత్వం సమగ్రంగా పునరుద్ధరించింది. నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ రూపొందిస్తున్నాం. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సౌకర్యాలు, యునీక్ హెల్త్ ఐడెంటిటీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సౌకర్యాలు ఉంచుతాం.
11.44 am :నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్.. కరోనా కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారి కోసం నాణ్యమైన మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్, సంరక్షణ సేవల కోసం జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభం. టెలీ మెంటల్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటుకు కృషి. నేషనల్ డిజిటల్ హెల్త్ సిస్టం కోసం ఓ వేదిక రూపొందిస్తాం. ఇది 23 టెలీ మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్వర్క్ను కలిగి ఉంటుంది. దీనికి నిమ్హాన్స్ నోడల్ సెంటర్గా మరియు ట్రిపుల్ ఐటీ బెంగళూరు సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. నాణ్యమైన మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్, సేవలకు మెరుగైన సౌకర్యం కోసం, జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తాం. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) మార్చి 2023 వరకు పొడిగిస్తాం.
11.40 am : విద్యార్థులకు శుభవార్త.. పీఎం ఈ-విద్య ప్రోగ్రాం కింద వన్ క్లాస్-వన్ టీవీ ఛానెల్ను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 12 ఛానెళ్ల నుంచి 200 ఛానెళ్లకు పెంచుతాం. వీటి ద్వారా అన్ని రాష్ట్రాలు మంచి విద్యను వారి వారి ప్రాంతీయ భాషలో అందించవచ్చు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ పాఠాలను ఆ ఛానెళ్లలో బోధిస్తారు. హై క్వాలిటీ డిజిటల్ టీచింగ్ కంటెంట్ను డెవలప్ చేస్తాం. విద్యార్థులకు డిజిటల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తాం. దేశమంతా ప్రపంచ స్థాయి యూనివర్సల్ ఎడ్యుకేషన్ను అందరూ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తాం. ఈ ప్రభుత్వం విద్యాభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తుంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగంలో యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దేశీయ యానిమేషన్ మార్కెట్.. ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా సేవలందించడానికి AVGC ప్రమోషన్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఈ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని మరింత పెంపొందించడానికి ఇంకా కృషి చేస్తాం
11.40 am : 2021-22 రబీ సీజన్లో గోధుమ ధాన్యం సేకరణ, ఖరీఫ్ సీజన్ 2021-22లో వరి ధాన్య సేకరణ అంచనా ప్రకారం 163 లక్షల మంది రైతుల నుంచి 1,208 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, వరిని కొంటాం. మొదటి దశలో గంగా నది వెంట 5 కిలో మీటర్ల పరిధిలో గల రైతుల భూములపై దృష్టి సారించి కెమికల్ ఫ్రీ వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తాం. రూ. 2.37 లక్షల కోట్లు నేరుగా వారికి మద్దతు విలువ ద్వారా చెల్లిస్తాం.
11.38 am : దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు నిర్మల తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్లు అందిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు. చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్నేషన్ వన్ప్రొడక్ట్ పథకం అమలు చేస్తున్నామని నిర్మల తెలిపారు. ఒమిక్రాన్ వేవ్ కొనసాగుతుంది.. ఈ క్రమంలో వ్యాక్సిన్ల వల్ల మేలు జరిగింది. కోట్ల మంది ప్రాణాలతో బయటపడ్డారు అని అన్నారు.
11.35 am : నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు.. ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్ను తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్ఫాం ఏర్పాటు చేస్తామన్నారు. క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు, ప్రత్యేక వ్యవస్థలు. ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్లైన్లో నేర్చుకునేందుకు అవకాశాలు ఉంటాయన్నారు.
11.33 am : దేశంలో కొత్తగా డిజిటల్ యూనివర్శిటీ.. పర్వతమాల ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది రోప్వేల అభివృద్ధికి చర్యలు. అరవైకిలోమీటర్ల దూరంతో ఒక్కో రోప్వే నిర్మాణం చేస్తామన్నారు. దేశంలో కొత్తగా డిజిటల్ యూనివర్శిటీ ఏర్పాటుకు అంగీకారం.
11.30 am : తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. నదుల అనుసంధానం కోసం డీపీఆర్లు సిద్ధమయ్యాయి. దమన్ గంగా – పిర్ పంజాల్, పర్ తాపీ – నర్మదా, గోదావరి – క్రిష్ణా, క్రిష్ణా – పెన్నా, పెన్నా – కావేరీ నదులు ఎంపిక చేశాం. దీనివల్ల లబ్ధిపొందే రాష్ట్రాల నుంచి అంగీకరం రాగానే ఈ నదుల అనుసంధానం కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది.
11.28 am : వందే భారత్ రైలు విజయవంతమైందని నిర్మల తెలిపారు. 75వ వడిలోకి వచ్చిన భారత్కు వందేళ్ల అభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఆ దిశగా చర్యలు తీసుకుంటామని నిర్మల పేర్కొన్నారు. వందేళ్ల భారతానికి ప్రధాని మోదీ ఒక మిషన్ రూపొందించారని,దానికి అనుగుణంగా పనిచేస్తున్నామని నిర్మల అన్నారు. వైద్య ఆరోగ్య సౌకర్యాల అభివృద్ధి,వ్యాక్సినేషన్కు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల్లో ముందంజలో ఉన్నామని నిర్మల తెలిపారు. ఎయిరిండియా బదిలీని సంపూర్ణం చేశామని పేర్కొన్నారు.
11.26 am : ఎయిరిండియా బదిలీని సంపూర్ణం చేశామని పేర్కొన్నారు. అభివృద్ధి ఆధారిత ఉపాధి, ఉద్యోగ కల్పనపరిశ్రమలకు ఆర్థిక ఊతం, పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్, దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం అని అన్నారు.
11.24 am : మెట్రో రైలు వ్యవస్థలను నిర్మించడానికి వినూత్న మార్గాలను అమలు చేయనున్నాం. పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 20వేల కోట్లు కేటాయించామని నిర్మల తెలిపారు. ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.
11.20 am : ఆత్మనిర్మర్ భారత్లో భాగంగా రాబోయే మూడు సంవత్సరాలలో 400 నవతరం వందే భారత్ రైళ్లు మెరుగైన సామర్థ్యంతో తీసుకువస్తాం. మరో 100 పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్ వచ్చే 3 సంవత్సరాలలో అభివృద్ధి చేస్తాం.
11.18 am : ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, వ్యవసాయ దారులకు సముచిత స్థానం కల్పిస్తున్నామని నిర్మల తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని నిర్మల తెలిపారు. పేద వర్గాలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
11.14 am : వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. వృద్ధిరేటులో మనం ముందున్నామని తెలిపారు. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించామని పేర్కొన్నారు.
11.08 am : వచ్చే 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్ పునాదిపారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ నాంది కానుందని బడ్జెట్ పద్దును ప్రవేశ పెడుతూ నిర్మలమ్మ తొలి మాటగా అన్నారు. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుందన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్ పరుగు ప్రారంభమైందన్నారు.
11.05 am : ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. వరుసగా నాల్గోసారి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను చదివి వినిపిస్తున్నారు.
10.45 am : బడ్జెట్ ట్యాబ్తో పార్ల మెంట్కు చేరుకున్న నిర్మలమ్మ టీమ్. ఈ ఏడాది కూడా పూర్తిగా పేపర్లెస్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
10.30 am : బడ్జెట్ ట్యాబ్తో పార్ల మెంట్కు చేరుకున్న నిర్మలమ్మ టీమ్. ఈసారి కూడా పూర్తిగా పేపర్లెస్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. పరిమిత సంఖ్యలోనే ప్రతులను ఆర్థికశాఖ ముద్రించింది.