ఊరేగింపు కోసం తీసుకొస్తున్న ఒక ఆలయ రథానికి మంటలు అంటుకున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు.
దేవుడ్ని దర్శించుకుందామని వచ్చారు. శోభాయమానంగా జరిగే జగన్నాథుడి రథయాత్రను కనులారా వీక్షిద్దామనుకున్నారు. కానీ పాపం.. ఆ రథయాత్రలోనే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన త్రిపురలోని ఉనకోటి జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడ జరిగిన రథయాత్రలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉనకోటిలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం సాయంత్రం 4.30 గంటల టైమ్లో జగన్నాథుడి రథయాత్ర ఉత్సవం జరుగుతుండగా కుమార్ ఘాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు చెప్పారు. పూర్తిగా ఇనునుతో తయారు చేసిన రథాన్ని ఊరేగింపు కోసం తీసుకొస్తున్నారు.
ఊరేగింపు కోసం వస్తున్న సమయంలో 133 కేవీ ఓవర్ హెడ్ కేబుళ్లకు రథం తగిలిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన టైమ్లో అనేక మంది భక్తులు ఆ రథాన్ని లాగుతున్నారని చెప్పారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ జ్యోతిష్మాన్ దాస్ చౌదరి తెలిపారు. రథయాత్ర విషాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని జ్యోతిష్మాన్ దాస్ పేర్కొన్నారు. రథయాత్రలో భక్తుల మృతిపై త్రిపుర సీఎం మాణిక్ సాహా సంతాపం తెలిపారు. రథయాత్ర విషాద బాధితులకు తమ సర్కారు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
VIDEO | Six dead, 15 injured as chariot comes in contact with high tension wires during Rath Yatra in Tripura. pic.twitter.com/1fOYYL2yO1
— Press Trust of India (@PTI_News) June 28, 2023