గతంలో పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన ఫాస్ట్ మూవీంగ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘నెస్లే ఇండియా’తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. మతపరమైన అంశం జోలికి పోవడంతో సోషల్ మీడియాలో కంపెనీని నెటిజనులు దుమ్మెత్తి పోశారు. దీంతో క్షమాపణలు చెప్పిన కంపెనీ.. తన చర్యను వెనక్కి తీసుకుంది. చాక్లెట్ కవర్లపై పూరి జగన్నాథస్వామి, బలభద్ర, సుభద్రల చిత్రాలను కిట్కాట్ ముద్రించింది. చాక్లెట్ కవర్లపై తాము ఆరాధించే దేవుళ్ల బొమ్మలు ముద్రించడమంటే తమ మత విశ్వాసాలను కించపరచడమేనంటూ సామాజిక మాధ్యమాల […]