వైద్యరంగలో అరుదైన ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. వైద్యులకు కూడా అంతుచిక్కని ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లో అలాంటి అరుదైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.
వైద్యరంగంలో అప్పుడప్పుడు అద్భుతమైన, అరుదైన ఘటనలు చోటుచేసుకుంటాయి. ఇప్పటి వరకు మనం వైద్యరంగలో జరిగిన పలు విచిత్రమైన ఘటనలను చూసే ఉంటాము. తాజాగా పశ్చిమబెంగాల్ లో అరుదైన ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళాలోని గర్భ సంచి రెండు భాగాలుగా ఉంది. రెండు భాగాలుగా గర్భసంచి కలిగిన ఆ నిండు గర్భిణీకి బెంగాల్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఇలా గర్భ సంచి రెండు భాగాలుగా ఉంటడం చాలా అరుదుగా జరుగుతుందని వైద్యులు తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు తెలిపారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమబెంగాల్ రాష్ట్రం నర్సింహపూర్ ప్రాంతానికి చెందిన అర్పిత మండల్ అనే మహిళ.. తన కుటుంబంతో కలసి నివాసం ఉంటుంది. ఆమె భర్త స్థానికంగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అర్పిత మండల్ కొన్ని నెలల క్రితం గర్భవతి అని తెలియడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. ఆమె తన ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. అయితే ఇటీవలో అర్పిత మండల్ కి పురిటి నొప్పుల వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు ఆమెను శాంతిపుర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గైనకాలజిస్ట్ పబ్రిత్ బపారీ అర్పితను పరీక్షించారు.
ఆమెలోని గర్భం రెండు భాగాలుగా విడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. పబిత్రో బపారీ ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి అర్పితకు ఆపరేషన్ చేయగా.. పండంటి కవలలు జన్మించారు. ఇలా ఒక మహిళలో రెండు భాగాలుగా గర్భసంచి ఉండటం అరుదుగా జరుగుతుంది. “ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి కేసులు 17 నమోదయ్యాయి. అందులో భారత్ లో మూడు కేసులు నమోదయ్యాయి. వాటిలోనూ రెండూ బెంగాల్ లోనే నమోదయ్యాయి” అని వైద్యులు పబిత్రో బపారీ తెలిపారు. గర్భిణికి అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులను శాంతిపుర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ అభినందించారు. మరి.. ఈ అరుదైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.