రెండేళ్లుగా దేశంలో కరోనా మహమ్మారితో ఎంతో మంది పిట్టల్లా రాలిపోయారు. కరోనా అంటేనే భయంతో వణికిపోతున్నారు. ఒకదశలో ఎవరైనా తుమ్మినా.. దగ్గినా కిలో మీటర్ దూరం పారిపోతున్నారు. అలాంటి క్లిష్ట సమయంలో కొంతమంది తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇక వైద్య రంగానికి చెందినవారు కరోనా సమయంలో చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. కరోనా కష్టకాలంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు తమ సేవలు ఎంతగానే చేశారు.. చేస్తున్నారు. అలాగే ఫుడ్ డెలివరీ బాయ్స్ అందించిన సేవలు గొప్పగా చెప్పకుంటున్నారు. ఎంతో రిస్క్ చేసి ఆహార పదార్థాలను ఇంటికి చేరుస్తున్నారు. అందుకే వీరిని ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించారు. అయితే వారి సేవలు ఆహార సరఫరాకు మాత్రమే పరిమితం కాదని నిరూపించాడు ఓ ఫుడ్ డెలివరీ బాయ్. రిటైర్డ్ కల్నల్ మోహన్ మాలిక్ కుటుంబం ముంబైలో నివాసం ఉంటుంది.
క్రిస్మస్ రోజున మాలిక్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, అతని కుమారుడు అతన్ని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తీసుకువెళుతుండగా, పండుగ రద్దీ కారణంగా కారు ట్రాఫిక్ సమస్యలో చిక్కుకుంది. వాహనాలు అస్సలు కదల్లేని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో ఆయన కొడుకు సాయం కోసం ఎంతో మంది ద్విచక్రవాహనదారులను ఎంతో ప్రాదేయపడ్డాడు. కానీ ఎవరూ అతని మాటలు పట్టించుకోలేదు. ఆ సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృణాల్ కిర్ దత్ ఆ పెద్దాయనను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. వెంటనే తన బైక్ పై వారిని కూర్చోబెట్టుకుని ముగ్గురూ ఆస్పత్రికి బయలుదేరారు.. గట్టిగా అరుస్తూ.. హారన్ కొడుతూ.. అడ్డుగా ఉన్న వాహనాలను దారి ఇవ్వలని కోరాడు.
ఇది చదవండి: CM సర్ సాయం చేయండి! మంచి మనసు చాటుకున్న సీఎం స్టాలిన్!
మొత్తానికి సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు. ఆస్పత్రికి చేరిన వెంటనే కిర్ దర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. ఇన్నాళ్లు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న పెద్దాయన ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. స్విగ్గీ ప్రతినిధులను సంప్రదించి అతడి అడ్రస్ కనుకున్నారు. తన ప్రాణాలు కాపాడిన డెలివరీ బాయ్ ని రియల్ సేవియర్ గా కొనియాడారు. అతడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఒక వ్యక్తి ఆపదలో ఉంటే తన జాబ్ ని కూడా పక్కనబెట్టి పెద్దాయన ప్రాణాలు కాపాడిన డెలివరీ బాయ్ చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.