గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో చిన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లడం మానేశారు. ఇటీవల కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. తిరిగి పాఠశాలలు పునః ప్రారంభించారు. అయితే ఇంట్లో ఇబ్బందులు.. మానసిక రుగ్మతలు కారణాలు ఏవైనా సరే కొంత మంది ఉపాధ్యాయులు పిల్లలపై దారుణంగా దాడులు చేస్తున్నారు. ఈ మద్యనే తమిళనాడులో ఓ విద్యార్థిని మాస్టార్ చితకబాదిన విషయం తెలిసిందే. కొంత మంది మొండిగా ప్రవర్తించే విద్యార్థులను బెదిరించడమే లేదా బుజ్జగించడమో చేసి వారిని దారిలో పెడతారు. కానీ కొంత మంది ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులను ప్రతి చిన్న విషయానికి దండిస్తున్నారు. దీని వల్ల చిన్న వయసులోనే పిల్లలు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. తాజాగా యూపీలో ఇటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
రెండో తరగతి చదివే విద్యార్థిని హెడ్మాస్టర్ బిల్డింగ్ మీది నుంచి కిందకు వేలాడదీశాడు. మీర్జాపూర్లోని ఓ పాఠశాల హెడ్మాస్టర్.. మనోజ్ విశ్వకర్మ.. రెండో తరగతి చదివే విద్యార్థిని తీసుకెళ్లి బిల్డింగ్ మీది నుంచి తల కిందులుగా వేలాడదీశాడు. ఆ పిల్లాడు భయంతో ఏడుస్తున్నాడు. హెడ్ మాస్టర్ సారీ చెబితేనే కిందికి దించుతానంటూ ఆ పిల్లాడిని బెదిరిస్తున్నాడు. హెడ్ మాస్టర్ చేసిన పనికి అక్కడ ఉన్న పిల్లలంతా ఒక్కసారే అరవడంతో కిందికి దించాడు. అప్పటికే సదరు మాస్టార్ ఘాతుకాలను ఫోటోలు, వీడియోలు షూట్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో హెడ్మాస్టర్పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద బుక్ చేశారు.
ఇక ఆ పిల్లాడు తుంటరి వాడని.. ఇతర పిల్లలను కొరుకుతూ ఉంటాడనని.. అంతే కాదు ఉపాధ్యాయులను కూడా ఒకటి రెండు సార్లు కొరికే ప్రయత్నం చేశాడని.. అందుకే కాస్త బెదిరించాలనే ఉద్దేశంతో అలా చేశానని.. అంతే కానీ పిల్లాడిపై ఎలాంటి కోపం లేదని.. ఆ పిల్లాడిని ఏదో చేయాలని కాదు అని హెడ్మాస్టర్ మీడియాకు తెలిపాడు.
This teacher also seems to have been inspired by #Godse:
In a school in #Mirzapur-Ahraura, #uttarpradesh student studying in class 2nd did mischief, then the teacher grabbed his feet and hanged him from the building. pic.twitter.com/9whomOUHaN
— Abhayjit singh(अभयजीत सिंह) (@abhayjitsandhu) October 28, 2021