ఆవుపేడకు డిమాండ్ బాగా పెరిగింది. ఇ–కామర్స్ వేదికల పుణ్యమా అని అంతర్జాతీయ స్థాయికి చేరింది ఆవుపేడ ఉత్పత్తుల మార్కెట్. ఒకప్పుడు ఆవు పేడతో చేసిన ఉత్పత్తుల మార్కెట్ జిల్లా సరిహద్దులకే పరిమితంగా ఉండేది. రోజురోజుకు ఇవి ఆన్లైన్ మార్కెట్ లో అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. దీంతో మహిళల సంపాదన ఇంటికి చక్కటి ఆదాయ వనరుగా మారింది. ఆవు పేడతో పిడకలే కాకుండా విగ్రహాలు, మొబైల్ ఫోన్స్టాండ్లు, నర్సరీ పాట్స్ వంటి ఎన్నో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వాటిని మార్కెట్ చేసి చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారు.
ఆవుపేడతో పిడకలే కాదు సృజనాత్మకతకు పదును పెట్టి రకరకాల ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. వాటిని అమ్ముతూ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు ఛత్తీస్ఘడ్లోని రాజ్నంద్గావ్ జిల్లాలోని కొన్ని గ్రామాల మహిళలు. వారి బిజినెస్ చూసి నవ్వుకున్న జనం ఇపుడు ముక్కున వేలేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక ఉన్నతాధికారి. ఉత్తరప్రదేశ్లో అపర్ణ అనే లాయర్ తన వృత్తికి స్వప్తి పలికి పేడ వ్యాపారంలోకి దిగారు. గౌతమబుద్ధనగర్ జిల్లాలో పది ఎకరాల విస్తీర్ణంలో గోశాల నిర్వహిస్తున్నారు. ఇందులో 120 వరకు ఆవులు ఉన్నాయి.గోశాల నుంచి వచ్చే పేడతో రకరకాల వస్తువులు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ఆవు పేడ వ్యాపారాన్ని అధ్యయనం చేయడానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్ వంటి ఎన్నో రాష్ట్రాల నుంచి మహిళలు ఎంతోమంది బృందాలుగా ఛత్తీస్ ఘడ్ లోని రాజ్నంద్గావ్ జిల్లాకు వస్తుంటారు. గ్రామాల్లోని మహిళ నుంచి ఎన్నో విషయాలుఅడిగి తెలుసుకుంటారు. అధికారులు కూడా వస్తుంటారు. 10 మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి పిడకలతో పాటు రకరకాల వస్తువులు తయారుచేసి ఆదాయాన్ని పొందుతున్నారు.