ప్రస్తుత కాలంలో ఏ పని జరగాలన్నా చేయి తడపాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే విచ్చలవిడిగా లంచం అడుగుతున్నారు. ప్యూన్ నుండి ఉన్నతాధికారుల వరకు అవినీతి బాగోతమే కొనసాగుతుంది.
దేశంలో ఏ వ్యవస్థలో అయినా లంచం లేనిదే పని జరగట్లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో చేయి తడపనిదే పని జరగదు అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తమ పని కావాలంటే లంచం లేదా బహుమానం రూపంలో అధికారులకు సమర్పించుకోవాల్సిందే. ప్యూన్ నుంచి మొదలు కొని ఉన్నతాధికారుల వరకు లంచం తీసుకోనిదే పని ముందుకు సాగనివ్వరు. ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నా కొంతమంది అధికారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఈ జాఢ్యం కేవలం ప్రభుత్వ సంస్థల్లోనే కాదు.. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఎగబాకింది. ప్రైవేట్ సెక్టార్లో మంచి ఉద్యోగం కావాలంటే.. అర్హతతో పాటు అడిగినంత డబ్బు సమర్పించుకోవాల్సిందే అంటున్నారు బాధితులు. తాజాగా బొగ్గు కుంభకోణంలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి అరెస్ట్ కావడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్గఢ్లో జరిగిన కోల్ లెవీ స్కాంలో మరో IAS అధికారి రానూ సాహూ మనీలాంరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. శనివారం ఈడీ అధికారులు రానూ సాహూను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖలో డైరెక్టర్గా రానూ పనిచేస్తున్నారు. రానూకు అదనపు జిల్లా జడ్జి అజయ్ సింగ్ రాజ్పుత్ మూడు రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతించారు.
బొగ్గు కుంభకోణంలో అరెస్టయిన రెండవ ఐఏఎస్ అధికారి సాహూ. రాయ్గఢ్, కోర్బా జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ లాయర్ సౌరభ పాండే తెలిపారు. ఆ సమయంలో ఆమె రూ.5.52 కోట్ల విలువైన చరాస్తులను కూడ బెట్టారని ఈడీ పేర్కొంది. ఈ ఆరోపణలను సాహూ వకీలు తీవ్రంగా ఖండించారు. సాహూను కల్పితమైన కారణాలతో అరెస్ట్ చేశారని అన్నారు. ఇదే కేసులో గత ఏడాది సమీర్ వైష్ణోయ్ కూడా అరెస్టయ్యారు.